తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 16 వ డివిజన్లో కార్పొరేటర్ మునిగడప పద్మ ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభించారు. ఆదివారం నేతాజీ స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాల పైబడిన వారి నుండి ప్రతి మహిళకు చీరలు ఇస్తే బాగుండేదని అలా మహిళ డిమాండ్ చేస్తున్నారని ఆమె అన్నారు.అందరికీ ఒకే రంగు కలర్ చీరలు కాకుండా కలర్, కలర్ చీరలు, నాణ్యత కలిగిన చీరలు ఇస్తే బాగుండేదని అన్నారు.వీటిపట్ల ప్రజలు అయీష్టత వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు. లేదంటే చీరల బదులు బతుకమ్మ, దసరా, రంజాన్, క్రిస్మస్ పండగల సమయాల్లో ఇంట్లోకి అవసరమైన పప్పులు, చక్కెర గోధుమపిండి, నూనె తదితర కిరాణా సరుకులు ఇస్తే ప్రజలు సంతోషిస్తారని ఆమె తెలిపారు. చీరల పంపిణీలో ఆర్ పి లు బానోత్ జానకి, మేడిపల్లి కవిత డ్వాక్రా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ