Monday, 03 August 2026 10:19:40 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 28 February 2026 08:02 PM Views : 318

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్చి 27, 28 తేదీలలో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం, మహా పట్టాభిషేక ఉత్సవాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులు ముందస్తుగా అప్రమత్తమై, పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని శనివారం సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. రేపు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించనున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులపై భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టకు పలు సూచనలు చేశారు.ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాలు, క్యూలైన్లు మరియు కళ్యాణ వేదిక వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి కుళాయిలు, వాటర్ ప్యాకెట్ల సేకరణ వంటి పనులను ముందస్తుగానే పూర్తి చేయాలని, ఆలయ ఈవో దామోదర్ రావు పర్యవేక్షణలో విద్యుదీకరణ, ఆలయ సుందరీ కరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భక్తుల ఆరోగ్య భద్రత కోసం వైద్య ఆరోగ్య శాఖ క్యూలైన్ల వద్ద వైద్య శిబిరాలను, అవసరమైన మందులు మరియు సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని, ఏరియా ఆసుపత్రిలో అత్యవసర విభాగాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.అగ్నిమాపక శాఖ వారు అవసరమైన ఫైర్ సేఫ్టీ పరికరాలతో సిద్ధంగా ఉండాలని, పోలీస్ మరియు ట్రాఫిక్ విభాగాలు సమన్వయం చేసుకొని వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సెక్టార్లను ఇప్పుడే ఖరారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల వసతి కోసం ఆన్‌లైన్ బుకింగ్, టికెట్ విక్రయాల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని, ఉత్సవ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని తెలిపారు. ఏర్పాట్లలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా భక్తులకు భక్తి పరిపూర్ణమైన అనుభూతిని అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :