Sunday, 01 March 2026 06:06:20 PM
# పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి. # జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు చదివి సింగరేణి కాలరీస్ లో assistant engineer Singareni calories గా ఉద్యోగం సంపాదించిన బానోత్ నరేష్ # శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. పదవీ విరమణ పొందిన ఎస్బి ఎస్సై సూర్యనారాయణను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ . # తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026 ఆవిష్కరణ. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ పదవీ బాధ్యతలు స్వీకరణ. # రూ.2 కోట్ల గంజాయి పట్టివేత. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా అంకిత్. # జిల్లా కలెక్టర్ బదిలీ. # తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్. # జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలో సీతంపేట గ్రామం ఎంపిక – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ని ఘనంగా సన్మానించిన సిపిఐ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్. # డివిజన్ ప్రజల ఆదరాభిమానాలకు రుణపడి ఉంటాం.16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ # మేయర్‌ను కలిసిన ప్రకృతి ప్రేమికులు. # సీఎం కప్ విజయాలు జిల్లాకు గర్వకారణం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. # పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు. # 28న జరుగు ఐ.ఎల్.పీ.ఏ రాష్ట్ర మహిళా సదస్సును జయప్రదం చెయండి. బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కీనేని సత్యనారాయణ.

శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 28 February 2026 08:02 PM Views : 89

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్చి 27, 28 తేదీలలో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం, మహా పట్టాభిషేక ఉత్సవాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులు ముందస్తుగా అప్రమత్తమై, పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని శనివారం సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. రేపు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించనున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులపై భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టకు పలు సూచనలు చేశారు.ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాలు, క్యూలైన్లు మరియు కళ్యాణ వేదిక వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి కుళాయిలు, వాటర్ ప్యాకెట్ల సేకరణ వంటి పనులను ముందస్తుగానే పూర్తి చేయాలని, ఆలయ ఈవో దామోదర్ రావు పర్యవేక్షణలో విద్యుదీకరణ, ఆలయ సుందరీ కరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భక్తుల ఆరోగ్య భద్రత కోసం వైద్య ఆరోగ్య శాఖ క్యూలైన్ల వద్ద వైద్య శిబిరాలను, అవసరమైన మందులు మరియు సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని, ఏరియా ఆసుపత్రిలో అత్యవసర విభాగాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.అగ్నిమాపక శాఖ వారు అవసరమైన ఫైర్ సేఫ్టీ పరికరాలతో సిద్ధంగా ఉండాలని, పోలీస్ మరియు ట్రాఫిక్ విభాగాలు సమన్వయం చేసుకొని వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సెక్టార్లను ఇప్పుడే ఖరారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల వసతి కోసం ఆన్‌లైన్ బుకింగ్, టికెట్ విక్రయాల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని, ఉత్సవ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని తెలిపారు. ఏర్పాట్లలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా భక్తులకు భక్తి పరిపూర్ణమైన అనుభూతిని అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :