తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టీ లక్ష్మీ నరసయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభు త్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విద్యను అభ్యసించా లన్నారు.ప్రభుత్వం వారికి ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ప్రతిరోజు ఆహారాన్ని కూడా ఏర్పాటు చేయిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి నేతాజీ AAPC చైర్ పర్సన్ బి సీతమ్మ పాఠశాల ఉపాధ్యాయులు జి సీతారాములు,జె మహేష్,డి నవనీత, ఆర్ పద్మ, స్కావెంజర్స్ మేరీ, నాగమ్మలు,పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ