తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి : జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అంటరాని తనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైనా విద్యను ఆయుధంగా మలుచుకొని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రపంచ మేథావి అయ్యారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని పార్టీ కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి,పోస్ట్ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.చిన్నతనం నుంచి సామాజిక వివక్షను ఎదుర్కొన్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకున్నారన్నారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిందని,భారత రాజ్యాంగం బలహీనవర్గాలకు రక్షణ కవచమని పేర్కొన్నారు.ప్రతీ ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా రాజ్యాంగ పుస్తకం ఉండాలని దాన్ని ప్రతీ ఒక్కరూ చదవాలని కోరారు.ఆయన రచనలు చదవడం వల్ల ఆయన ఆలోచన విధానం అర్థమవుతుందని ప్రతి ఒక్క భారతీయుడు అంబేద్కర్ గారి రచనలను చదవాలని అన్నారు.అంబేద్కర్ గారు తన చదువును,జీవితాన్ని పూర్తిగా అణగారిన వర్గాల అభివృద్ధికి అంకితం చేశారని ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లిఖార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,చెనిగరపు నిరంజన్ కుమార్,పాల్వంచ పట్టణ అధ్యక్షుడు నిట్ట నర్సింహ రావు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ