Saturday, 19 September 2026 01:36:41 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కోసం తొలి ఉద్యమం ఎఐటియుసిదే-వంగ వెంకట్.

Date : 18 July 2026 07:11 PM Views : 166

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి ప్రధాన కార్యాలయం, మెయిన్ వర్క్‌షాప్‌లో శనివారం నిర్వహించిన తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ సాధన విజయోత్సవ సభలో ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని 2013లోనే ఎఐటియుసి తొలి ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అనంతరం 2017 మే నెలలో "సింగరేణి జాతా" పేరుతో తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర నిర్వహించిన ఏకైక కార్మిక సంఘం ఎఐటియుసినేనని పేర్కొన్నారు.తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ సాధనలో కార్మికులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు అందించిన సహకారం అభినందనీయమని ఆయన అన్నారు.అదేవిధంగా, జేవీఆర్ ఓసీ–3, కోయగూడెం, శ్రావణపల్లి,మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్‌లను కూడా సింగరేణికే కేటాయించి సంస్థ మనుగడను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను చెల్లించాలని కోరారు. అలాగే, సింగరేణి సంస్థకు జెన్‌కో నుంచి రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే వసూలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విజయోత్సవం తాడిచర్ల–2 సాధనలో ఎఐటియుసి పోరాట చరిత్రను మరోసారి గుర్తు చేసిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్),డైరెక్టర్ (పీపీ),జిఎం (సిపిపీ),జీఎం (వెల్ఫేర్),సిఎంఓఏ నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :