తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తులు స్వీకరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు అందేలా లేవని ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు అందని ద్రాక్షల ఉందన్నారు.ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి సంవత్సరం గడిచాక ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల సర్వే అంటూ హడావుడి చేస్తున్నారు తప్ప నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు.గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు కాలంలో చాలా మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం టిక్ మార్క్ చేసుకోకపోవడంతో ఇప్పుడు సర్వే సిబ్బంది ఇంటింటి సర్వేకు వచ్చినప్పుడు వారి పేర్లు లేకపోవడంతో లబ్దిదారులు మున్సిపల్,రెవిన్యూ,కలెక్టర్ కార్యాలయల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిదారుల ఎంపికలో అవినీతి,అక్రమాలకు చోటు లేకుండా ఉండాలంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రజల సమక్షంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని కోరారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజాపాలన దరఖాస్తులో ఇందిరమ్మ ఇండ్ల కోసం టిక్ మార్క్ చేయని వారి కోసం కనీసం వారం రోజులు గడువు విధించైనా దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,పోలే కనకరాజు,వినయ్,మురళి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ