Saturday, 19 September 2026 11:02:13 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

వన మహోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Date : 18 June 2026 08:25 PM Views : 116

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వన మహోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కిన్నెరసాని తెలంగాణకు ఊపిరితిత్తుల వంటిది – ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. జిల్లాలో 55 లక్షల మొక్కల నాటడమే లక్ష్యం – జిల్లా కలెక్టర్ అంకిత్.రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన హరిత కార్యక్రమాలతో పాటు కిన్నెరసాని వన్యప్రాణి నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వర్చువల్ విధానంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో భాగంగా కిన్నెరసాని వన్యప్రాణి నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం .45 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సఫారీ వాహనాలు, ట్రెక్కింగ్ సౌకర్యం, బటర్‌ఫ్లై పార్క్, జింకల పార్కులో ఫీడింగ్ షెడ్, సీసీ రోడ్డు తదితర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ అంకిత్ సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న జిల్లాగా గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని పేర్కొన్నారు. కిన్నెరసాని తెలంగాణకు ఊపిరితిత్తుల వంటిదని అన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించడంతో పాటు కొత్తగా అటవీ భూముల ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కిన్నెరసానిని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కిన్నెరసానిలో తీగల వంతెన నిర్మాణం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని, అద్దాల మేడ, జూ పార్కు, బోటు షికారు, పర్యాటక హోటల్ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మణుగూరులోని వేడి నీటి గుంతల ప్రాంతం వరకు కిన్నెరసాని సఫారీ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా అతి త్వరలో కొత్తగూడెం పట్టణానికి రూ.500 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు, అతి పెద్ద ఫ్లై ఓవర్ బ్రేడ్జి మంజూరుకు చర్యలు జరుగుతున్నాయని వెల్లడించారు. అటవీ సంపద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, జిల్లాలో హరితాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 50 శాతం భూభాగం అటవీ ప్రాంతంగా ఉందని, జిల్లా ప్రజల జీవన విధానం అడవులతో ముడిపడి ఉందన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 55 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు 42 శాఖలకు మొక్కల నాటే బాధ్యతలను కేటాయించామని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. గత 24 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం రాత్రి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవడం ఆందోళనకర విషయమని, పర్యావరణ సమతుల్యత కోసం విస్తృత స్థాయిలో మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు మొక్కల సంరక్షణపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. నాటిన మొక్కల్లో కనీసం 95 శాతం మొక్కలు వృక్షాలుగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం అని తెలిపారు. జిల్లాలో సుమారు ఎనిమిది లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నదని పేర్కొన్నారు. గతంలో కొంత మేర అటవీ భూమిని కోల్పోయినప్పటికీ ప్రస్తుతం అటవీ సంపద పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. అభివృద్ధి, అటవీ సంరక్షణ, గిరిజనుల సంక్షేమం సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా కిన్నెరసానిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం సఫారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సర్పంచ్ వజ్జా రామకృష్ణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎఫ్డిఓ లు బాబు, చారి, తాసిల్దార్ ధారా ప్రసాద్, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రకృతి ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :