Friday, 18 September 2026 01:11:36 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

మార్కెట్లో దళారుల దోపిడీ అరికట్టాలి

Date : 05 December 2024 05:32 PM Views : 733

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 5(తెలుగు వెలుగు)జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కెట్ను ఏర్పాటు చేయాలి మరియు మండల కేంద్రాలలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అంటూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం డిమాండ్ చేశారు . పత్తి, ధాన్యం అమ్ముతున్న మార్కెట్లలో దళారులు దోపిడీని అరికట్టాలని, పత్తి పంట అధికంగా పండుతున్న మండలాల్లో తక్షణమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం డిమాండ్ చేశారు. గురువారం జూలూరుపాడు కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పత్తి పంట చేతికొచ్చి నెలలు దాటుతున్నప్పటికీ సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయటంలో మార్కెటింగ్ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో అధికంగా పత్తి వండుతున్న జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ఉప మార్కెట్ యార్డును శాశ్వత వ్యవసాయ మార్కెట్ గా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కొత్తగూడెం మార్కెట్ కు అనుసంధానంగా సుజాతనగర్ లో కూడా ఉప మార్కెట్ యార్డును ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగే విధంగా వ్యవసాయ శాఖ చూడాలని కోరారు. జిల్లాలో ప్రధానంగా జూలూరుపాడు సుజాతనగర్ చంద్రుగొండ టేకులపల్లి గుండాల ఆళ్లపల్లి, పాల్వంచ ములకలపల్లి దమ్మపేట, తదితర మండల కేంద్రాల్లో, కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్, చర్ల వ్యవసాయ మార్కెట్,ఇల్లందు వ్యవసాయ మార్కెట్ లలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దళారుల ప్రమేయం లేకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆయన కోరారు. కేంద్ర పాలకుల కార్పోరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు రైతులు కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కోని నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు.రైతులు పండిస్తున్న అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ సిపార్సులు మేరకు మద్దతు ధర వ్యవసాయ ఖర్చుకు 50 శాతం అదనంగా జోడించి అమలు చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నా మోడీ ప్రభుత్వం నిమ్మక నేరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2024 ,2025 సంవత్సరానికి 5 .35 శాతం పెంచి వరి క్వింటాకు 2300 మద్దతు ధరలను నిర్ణయించిందని, రైతుల డిమాండ్ ప్రకారం పంటల పెట్టుబడి ఖర్చు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలను పెంచడం లేదని ఆయన ఆరోపించారు. వరి పంట పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించారని, వాటిని తక్షణమే రైతు ఖాతాలో జమ చేయాలని ఆయన కోరారు. ఈ మావేశంలో పార్టీ జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు, బానోతు ధర్మ, రాయల సిద్దు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :