తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకోని వచ్చి కార్మికులు హక్కులను కాల రాస్తుంది.కేంద్రప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తొలగించి, 4 చట్ట స్వభావం లేని కోడ్లుగా మార్చడాన్ని సింగరేణి కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయన్నారు. కొత్త కోడ్స్ ను రద్దు చేసి పాత 29 చట్టాలనే కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గతంలో కేంద్రం తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మిక సంఘాలన్నీ ధర్నాలు, ఆందోళనలు, సమ్మెలు చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారుల కోసమే కేంద్రం పనిచేస్తుందని ఆరోపించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నాలుగు కోడ్ లను అనుమతించమని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష యూనియన్ ల ఆధ్వర్యంలో హెడ్ ఆఫీస్ జిఎం ఆఫీస్ ల ముందు ధర్నా నిర్వహించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. హెడ్ ఆఫీస్ లో ఏ జిఏం అజయ్ గారికి, కొత్తగూడెం ఏరియా ఎస్ఓ టు జియం కోటి రెడ్డి గారికి మెమొరండం ఇవ్వడం జరిగింది. సింగరేణి వ్యాప ఎఐటీయుసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ ముఖ్యనాయకులు టిబిజికెఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, గడప రాజయ్య, విజయ్ కుమార్, ఏఐటీయూసీ నాయకులు వంగ వెంకట్, కిష్టపర్ మల్లికార్జున్ , intuc నాయకులు, త్యాగరాజన్, హితంబరం, రజాక్, సిఐటియు నాయకులు విజయగిరి శ్రీనివాస్, రమేష్ ,ఏఐటియుసి, ఐ ఎన్ టి యు సి, సిఐటియు, టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు, మహేందర్, జిఎస్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు బాచిరెడ్డి, ఎస్కే హైమద్, ఎస్కే యాకూబ్ పాషా,ఎస్ కే యాకుబ్ గౌరీ, వాసంశెట్టి నాగరాజు, బుక్య రాంబాబు ,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ