తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎక్సైజ్ అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు పోలీసులకు దీటుగా పని చేసిడిపార్టుమెంట్కు మంచి పేరు తీసుక రావాలని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబికమలాసన్రెడ్డి అన్నారు. సోమవారంఖమ్మం,కొత్తగూడెం, పెద్దపల్లి,కాగజ్నగర్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన 86 మందికి ఎక్సైజ్ అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి చేతుల మీదుగా క్యాష్ అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం ఎక్సైజ్శాఖ (అబ్కారీ భవన్) సమావేశ మందిరంలో జరిగింది. తెలంగాణలో ఎక్సైజ్శాఖ పట్టుకుంటున్న గంజాయిలో 90 శాతం గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం జి ల్లాలో పట్టుకోవడం అనందంగా ఉంద`న్నారు. ఏఓబీ నుంచి వస్తున్న గంజాయిని పట్టుకోవడంతో పాటు ఇతర మార్గాల్లో కూడ గంజాయి తరలివెలుతున్న మార్గాలను కనిపెట్టాలన్నారు. ఏపీ, ఒరిస్సాల్లో పండుతున్న గంజాయి దేశంలోని అన్ని ప్రాంతాలకు వెలుతుంద`ని అన్నారు. నేరస్థులకు శిక్షలు పడినపుడు నిందితులకు నేరం చేయాలంటే భయం వేస్తుందని అన్నారు. గంజాయిని పట్టుకున్నప్పుడు పంచనామా నుంచి కేసు ట్రయల్, శిక్షణలు పడేవిధాంగా చార్జీషీట్స్ రాయాలని సూచించారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ పని తీరు బాగుందని, మరింతగా కృషి చేసి ప్రభుత్వం అదేశించిన రీతిలో గంజాయి, డ్రగ్స్ను లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేయాలన్నారు. ఖమ్మం, కొత్తగూడంలో 72 మందికి, పెద్దపల్లి, సుల్తానాబాద్ నుంచి 8 మందికి, కాగజ్నగర్, నిర్మల్ నుంచి 3 ముగ్గురికి, అపరేషన్ ధూల్పేట్లో భాగంగా ఎక్సైజ్ సూపరిండెంట్ నంద్యాల అంజి రెడ్డి, సీఐలు మదుబాబు, గోపాల్ నగదు రివార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్తోపాటు జాయింట్ కమిషనర్ ఖురేషి, కరీంనగర్, ఖమ్మం డిప్యూటి కమిషనర్లు డేవిడ్ రవికాంత్, జనార్ధన్రెడ్డి అసిస్టేంట్ కమిషనర్లు ప్రణవీ, గణేష్లతోపాటు ఎక్సైజ్ సూపరిండెట్లు నంద్యాల అంజి రెడ్డి, పెద్దపల్లి, నిర్మల్ మహిపాల్, రజాక్, ఏఈఎస్లు తిరుపతి, కరమ్చంద్ పాల్గొన్నారు. ఏ సి గణేష్,సీఐ రహిమ్ఉన్నిషా బేగం, హెడ్ కానిస్టేబుల్ రహిమ్ లను డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ