Sunday, 02 August 2026 06:52:06 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

వర్షాకాలం నేపథ్యంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ ,డిడిఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖలతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Date : 03 June 2026 02:46 PM Views : 57

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాబోయే వర్షాకాలం నేపథ్యంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ ,డిడిఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం మరియు అగ్నిమాపక శాఖలతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదురుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, డిడిఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం మరియు అగ్నిమాపక శాఖలతో కోఆర్డినేషన్ మీటింగ్ బుధవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ముందస్తు చర్యలుగా రక్షక బృందాలను ముంపుకు గురయ్యే ప్రాంతాల సమీపంలో ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్, ఎస్‌డీఆర్‌ఎఫ్ , డిడిఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ టీం మరియు అగ్నిమాపక శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. బోట్లు, లైఫ్ జాకెట్లు, రోప్స్, చెట్లను తొలగించడానికి కావలసిన కట్టర్లను ఇతర రక్షణ సామాగ్రిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీక్షల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలుగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ క్రాంతి కుమార్, టీజీఎస్పి అసిస్టెంట్ కమాండెంట్ మరియా దాస్,ఆపరేషన్ ఆర్ఐ బి. రవి, సింగరేణి రెస్క్యూ టీం ఇంచార్జ్ అనంత రాములు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు సుమంత్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :