తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు పరిధిలో ఈ రోజు శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి ఉత్సవంలో భాగంగా జూలూరుపాడు, వెంగన్నపాలెం ,వినోబా నగర్ లో బైక్ ర్యాలీ చేసి జూలూరుపాడులో సభా కార్యక్రమం నిర్వహణ చేయనైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం జిల్లా RSS ప్రచారక్ నందమూరి వెంకటేష్ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చత్రపతి శివాజీ ఏ విధంగా ఏకం చేశారు, హిందువులకు ఐక్యమత్యం చేస్తూ రాజ్యాలను కాపాడుకుంటూ రాజ్య విస్తరణ చేశారు అని శివాజీ యొక్క పరాక్రమం గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో సోడే శ్రీరామ్, కొండెం శివాజీ, వార అమరనాథ్, మద్దిబోయిన నాగరాజు, యలమద్ది సాయి కృష్ణ, బెజవాడ పవన్, ఆనంకి శ్రీకాంత్ , బొమ్మశెట్టి వెంకటేష్, మద్దిబోయిన శ్రీకాంత్, చెంగల నరసింహారావు, రాజు, ముదిగొండ ప్రశాంత్, అనిల్ ,సాయి కిరణ్, నరేందర్ , ఉషికల గోవర్ధన్, గుమ్మడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ