తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం - మిరియాల రంగయ్యా సోమవారం ఉదయం సెంట్రల్ వర్క్ షాప్ లో గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశం లో అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్యా మాట్లాడుతూ సెంట్రల్ వర్క్ షాప్ లో సరైన మ్యాన్ పవర్ లేక పని ఒత్తిడి,పని భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు,కార్మికుల వేదింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు, సెంట్రల్ వర్క్ షాప్ ను గతంలో మూసివేద్దామని యాజమాన్యం విశ్వప్రయత్నాలు చేస్తే ఆనాడు ఎఐటియుసి వ్యతిరేకించి మూతపడకుండా నిలబడిందని గుర్తుచేశారు,పెండింగ్ లో చాలాకాలంగా ఉన్న డిపెండెంట్ లకు ఉద్యోగ నియామకాల పత్రాలు వెంటనే జారీ చేయాలని అన్నారు,అదేవిధంగా మెడికల్ బోర్డు పెట్టకుండా యాజమాన్యం కాలయాపన చేస్తుంది అని మండిపడ్డారు,మరియు రీజియన్ లో ఉన్న వికే కోల్ మైన్ లో సింగరేణి కార్మికులచే తియ్యాలి అని తెలిపారు,అదేవిధంగా పెండింగ్ లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని మరియు సి & ఎండి స్థాయి స్టక్చర్ కమిటీ సమావేశంలో ఒప్పుకున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ 6న అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ వద్ద నిరసన కార్యక్రమలు,మరియు 8న జీఏం కార్యాలయాల వద్ద భారీ ధర్నాలు కార్యక్రమాలు విజయవంతం చెయ్యాలని కార్మికులను కోరారు,అదేవిధంగా సింగరేణి కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేర్చి ప్రతి కార్మికుడికి 200వందల గజలస్థలం తో పాటు 30లక్షలు వడ్డీలేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు,అదేవిధంగా ఎఐటియుసి గుర్తింపు సంఘంగా గెలిచిన దగ్గరనుండి కార్మికుల పక్షాన నిలబడి అనేక కార్మికుల సమస్యలు పరిష్కరించం అని రానున్నరోజుల్లో కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కావున కార్మికులు గమనించాలని అన్నారు,ఈ కార్యక్రమం లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్,సహాయ కార్యదర్శి రాము,సెంట్రల్ వర్క్ షాప్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ నరేష్, అడ్వైజర్ రాజేశ్వరరావు, బి రవీందర్, సీనియర్ కార్మికుడు జాన్ నరసయ్య, ఆనంద రెడ్డి శ్యామ్,లింగం, నరసింహ రామ్మోహన్,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ