Thursday, 17 September 2026 05:08:54 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోం : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా

Date : 17 September 2026 04:14 PM Views : 11

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్షమాభిక్ష కోరినవారు దేశభక్తి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అధికారికంగా విలీన దినం జరపాలి..పాఠ్యాంశాల్లో చేర్చాలి 24 లక్షల ఎకరాల భూపంపిణీ చేసిన ఘనత కమ్యూనిస్టులదే మతోన్మాద శక్తుల విభజన కుట్రలను తిప్పికొడదాం పోరాటాలతోనే ప్రజాస్వామ్య, హక్కుల పరిరక్షణ అమరవీరుల ఆశయ సాధనకు పునరంకితం కావాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మత రంగు పులిమి వక్రీకరించే మతోన్మాద శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని, తెలంగాణ అమరుల నిజమైన త్యాగాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని 'శేషగిరి భవన్' జిల్లా కార్యాలయంలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ, తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను ప్రభుత్వాలు అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించాలని, భావితరాలకు తెలిసేలా చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలనపై, భూస్వాముల వెట్టిచాకిరీ, దోపిడీకి వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీయే ముందుండి నాయకత్వం వహించిందని స్పష్టం చేశారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ వంటి వీరుల నాయకత్వంలో 4,500 మంది ప్రాణాలర్పించి తెలంగాణను విముక్తి చేశారని గుర్తుచేశారు. ఈ మహత్తర పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాలు, తదనంతర ఉద్యమాలతో కలిపి మొత్తం 24 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఒక్క ఎర్రజెండాకే దక్కుతుందని కొనియాడారు. స్వాతంత్య్ర, సాయుధ పోరాటాల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తుల పాత్ర ఏమాత్రం లేదని, నాడు క్షమాభిక్షలు కోరిన వారు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ పునరంకితమై పోరాడతారని ఆయన పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబాలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పట్టణానికి చెందిన దూడల బుచ్చయ్య అమరవీరుడు దొడ్డి కొమరయ్య వేషధారణతో హాజరై కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కంచర్ల జమలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, గనిగళ్ల వీరాస్వామి, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, మువ్వ వెంకటేశ్వరరావు, భూక్యా దస్రు, ఎస్.కె. ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు దీటి లక్ష్మీపతి, కొమారి హన్మంతరావు, భూక్య శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, జక్కుల రాములు, దారా శ్రీనివాస్, పేరాల శ్రీనివాస్, రమణమూర్తి, సప్క నాగేశ్వరరావు, యూసుఫ్, ధర్మరాజు, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, గోపికృష్ణ, షాహీన్, పైడిపల్లి లక్ష్మి, కైసర్, కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, దుర్గయ్య, పొలమూరి ధనలక్ష్మి, కూరపాటి సుధాకర్, బండి నర్సింహా, దాసరి శ్రీనివాస్, సత్యనారాయణాచారి, సపావట్ రవి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :