Thursday, 14 May 2026 03:51:44 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

గుండెపుడి రెవిన్యూ సీలింగ్ భూమి 117లో అక్రమాలను ఆపాలి.

Date : 14 May 2025 07:44 PM Views : 456

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 14 తెలుగు వెలుగు)జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి రెవెన్యూ ప్రాంతం, సర్వే నంబర్ 117లో సీలింగ్ భూమి ఆక్రమణలకు గురవుతోందని, తక్షణమే విచారణ నిర్వహించి అక్రమాలను అడ్డుకోవాలని గ్రామీణ పేదల సంఘం, ఆదివాసీ సంఘం నేత బచ్చల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గిరిజన, గిరిజనేతర పేదలు జీవనం కోసం ప్రభుత్వ భూముల్లోకి వెళితే రెవెన్యూ, అటవీశాఖ అధికారులు అడ్డుకొని, పలు విధాలుగా వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారని అన్నారు. కానీ కొందరు బడాబాబులకు మాత్రం ఆయా శాఖలకు చెందిన అధికారులు కొందరు వత్తాసు పలుకుతూ గుండెపుడి రెవెన్యూ సర్వే నెంబర్ 117లో కొంత సీలింగ్ భూమిని ఏజెన్సీ, గిరిజన ప్రాంత చట్టాలను ఉల్లంఘిస్తూ పథకం ప్రకారం ఒకరిద్దరి వ్యక్తుల పేరున అక్రమంగా పట్టాలు చేశారని ఆరోపించారు. ఇంతటితో ఆగకుండా అక్రమంగా సీలింగ్ భూములు కాజేసి, అట్టి భూముల్లో పెద్ద ఎత్తున పైరవీలు చేసి, పరపతి ఉపయోగించి బినామీల పేరుతో అక్రమ మార్గాన మైనింగ్ అనుమతులు తీసుకొచ్చారని అన్నారు. అనుమతుల పేరుతో గత రెండు నెలల కాలంగా కాజేసిన సీలింగ్ భూమిలో పెద్ద ఎత్తున యంత్రాలతో గుట్టలను తవ్వుతున్నారని అన్నారు. టిప్పర్లతో రాత్రింబవళ్లు మట్టిని దూర ప్రాంతాలకు తరలిస్తూ లక్షల రూపాయలు అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారని అన్నారు. కొంతమంది ముఠాగా తయారై ధనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా దందా చేస్తున్నారని, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే సీలింగ్ భూమిని పట్టా చేసిన విషయం తేట తెల్లమవుతోందని అన్నారు. సీలింగ్ భూమి ఆక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు చేయటం, గుట్టలను తవ్వి ప్రకృతిని విధ్వంసం చేయడం వంటి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి సీలింగ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనింగ్ ఆఫీసర్, కొత్తగూడెం రెవిన్యూ డివిజన్ ఆఫీసర్ గారికి కూడా లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలకు విరుద్ధంగా సీలింగ్ భూములను ఆక్రమించి, మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్న వ్యక్తులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :