తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం, డిసెంబర్ 4 {తెలుగు వెలుగు } బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలను తక్షణమే ఆపాలని,ఇస్కాన్ సన్యాసి చిన్మయ కృష్ణ దాసును జైలు నుంచి విడుదల చేయించేలా తగు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సనాతన హిందూధర్మ ఐక్యవేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ రామాలయం నుండి ఎంజీ రోడ్డు, గణేష్ టెంపుల్,పెద్ద బజార్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు సనాతన హిందూ ధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదనంతరం అక్కడి నుండి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి గౌరవ కలెక్టర్ గారికి ఈ విషయమై ఒక మెమొరాండంను సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొదమసింహం పాండురంగాచార్యులు, యెల్దండి పూర్ణచందర్ రావు, నంది శశి కుమార్, k v రంగాకిరణ్ ,, బైరెడ్డిప్రభాకర్ రెడ్డి, వర్ధన్ రావు, ,పిల్లిరాజేశ్వరరావు,మదన్ రెడ్డి, మహేష్ , పార్థసారథి, గడదశి వెంకటేశ్వర్లు , గంగాధరి సీత , చింతేశ్వర్ , శర్మ, రాధాకృష్ణ శర్మ ,కిరణ్, ధారా నగేష్, పల్లపోతు శ్రీనివాస్, సత్యనారాయణ, తదితర హిందూ సంఘ నాయకులందరూ పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ