తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫోటోలకు ఫోజు కాకుండా నేను సైతం అంటూ అరగంట పాటు స్వయంగా మాతోపాటు పెద్ద పెద్ద పిచ్చి మొక్కలను గట్టిగా లాగి తొలగించడంలో అభినందనీయమని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ కొనియాడారు .శుక్రవారం లక్ష్మీ టాకీస్ ఏరియా ఓపెన్ జిమ్ లో జరుగుతున్న శ్రమదానం లో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి అక్కడికి విచ్చేసి ,వచ్చామా, పోయామా, ఒక ఫోటో కు పోజు ఇచ్చామా అని కాకుండా మాతో పాటుగా పాల్గొని సుమారు అర్థగంట పాటు మొక్కలను తొలగించడం జరిగిందని ఆమె అన్నారు .సింగరేణి కాలీ స్థలాల్లో పెన్షన్ తీగేసిన స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి నివాస ఇళ్లలోకి పాములు, తేలు విషపురుగులు వస్తున్నాయని ,ఆ ప్రాంతంలోని ఖాళీ స్థలాన్ని కమీషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆమె తెలిపారు. స్పందించిన కమిషనర్ సింగరేణి అధికారులకు మున్సిపాలిటీ ద్వారా లెటర్ పెట్టి ఆయా ప్రాంతాల్లోనూ పిచ్చి మొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని కమిషనర్ హామీ ఇచ్చారని తెలిపారు .
వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా కమీషనర్ మరియు కౌన్సిలర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సబ్ జైల్ ప్రాంతంలో పెంచిన కోటి వృక్షార్జన ప్రాంతాన్ని కమిషనర్ సందర్శించి కార్మిక వాడల్లో కాలుష్య నివారణ కోసం స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రజలకు ఇచ్చేందుకు ఈ కోటి వృక్షాలు ఉపయోగపడుతుందని కోటి వృక్షాల్లో చెట్లను ఇంత పెద్దగా పెంచడం అభినందనీయమని కమిషనర్ కౌన్సిలర్ ని కొనియాడారు .వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటుగా సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహన్ ,,సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, నాయకులు మునిగదప వెంకటేశ్వర్లు,, అజరయ్య ,జహీర్, వెంకటలక్ష్మి ,శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ