తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు తేదీని మరో వారం రోజులు పొడిగించి కుల ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు త్వరగా వచ్చేలాగా చూడాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫహీమ్ దాదా కోరారు, అర్హులైన నిరుద్యోగ యువతకు ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు చేసుకోడానికి కుల ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం నిరుద్యోగులు తీవ్రంగా రోజుల తరబడి ఇబ్బందులు పడుతూ తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఇప్పటికే లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు ఇంకా లక్షల్లో ఉన్నారని తెలిపారు, దీన్ని బట్టి చూస్తే మీరు ఉద్యోగ సమస్య ఉద్యోగ ఉపాధి అవకాశం లేని వారు ఎంత ఉన్నారో అర్థమవుతుందన్నారు నీరు ఉద్యోగులకు దాదాపు పది రోజులైనా గానీ ధ్రువీకరణ పత్రం రావడం లేదని ఇదేమిటని తాసిల్దార్ కార్యాలయంలో అడిగితే సాఫ్ట్వేర్ ఇబ్బంది ఉందని సమయం పడుతుందని చెప్పడంతో దరఖాస్తు చేసుకోవాలన్నా నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బంది జరుగుతుందన్నారు కొన్ని బ్యాంకులకే ఈ పథకం అనుసంధానం ఉన్న నేపథ్యంలో కొత్తగా బ్యాంకులు అకౌంట్లు తీసుకోవడానికి సమయం పడుతుందని దరఖాస్తు స్వీకరణకు ఈనెల 14 వరకు చివరి తేదీ ఉండడంతో నిరుద్యోగులు తాసిల్దార్ కార్యాలయాల వద్ద బ్యాంకుల వద్ద ధ్రువీకరణ పత్రాల కోసం పడిగాపులు కాస్తున్నారని తరచు సర్వర్ డౌన్ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు వారసగా నేటి నుంచి మూడు రోజులు పాటు బ్యాంకు సెలవల దృష్ట్యా ప్రభుత్వం ఈ సమస్యను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకో వారం రోజులపాటు దరఖాస్తు తేదీనే పొడిగించాలని కోరారు..
Admin
తెలుగు వెలుగు టీవీ