తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం 19వ డివిజన్లోని వన్నం దాస్ గడ్డ శాఖ వన్ కార్యదర్శి సూరీమేని జనార్ధన్ అకాల మరణం సిపి ఐ పార్టీకి తీరనిలోటని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా అన్నారు. బ్రెయిన్ డెడ్ తో ఆసుపత్రిలో చికిత్స పొందు సీనియర్ కామ్రేడ్ శాఖా కార్యదర్శి సూరీమేని జనార్ధన్ మరణ వార్త తెలుసుకున్న సాబీర్ పాష ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పార్టీ జెండా కప్పి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. వన్నం దాస్ గడ్డ ప్రాంతం అలాగే సిపిఐ పార్టీకి ఆయన మరణం తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఆకర్షిత రాజకీయాల్లో తాను నమ్మిన పార్టీ సిద్ధాంతం కోసం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ ప్రాంత సిపిఐ నిర్మాణం కోసం ఆయన తుది శ్వాస వరకు సిపిఐ పార్టీ లో ఉండి మరణించారని అన్నారు.
ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం 30 ఆటోలతో ర్యాలీగా వెళ్లి అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య ,జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు , బుక్య శ్రీనివాస్ మునిగడప పద్మ, రామవరం బ్రాంచ్ కార్యదర్శి మరి గోపి, నాయకులు తుముల శ్రీనివాస్, మండల రాజు, గుత్తుల శ్రీనివాస్, కమల్ సీనియర్ నాయకులు గంటాడు కోటేశ్వరరావు, బయన్న ఈశ్వరయ్య, అజ్మత్ పాషా, ఉన్నందాస్ గడ్డ శాఖ టు కార్యదర్శి ఎస్కే జలీల్, నాయకులు తోగరు నరేంద్ర కుమార్, బానోతు చందర్, గుగులోతు శంకర్ ఏవైఎఫ్ జిల్లా నాయకులు ఖయ్యూం బానోత్ శ్రీనివాస్, దాట్ల శ్రావణ్ మహిళా నాయకురాలు మునిగడప పద్మ, కరిష్మా రత్నకుమారి, మహబూబి,షాహిన్, విజయలక్ష్మి ,భాగ్య, మార్తమ్మ ,కైసర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ