Saturday, 18 April 2026 05:07:18 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

రైతులకు స్థిర ఆదాయానికి సమీకృత వ్యవసాయం ఉత్తమ మార్గం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 02 February 2026 07:59 PM Views : 161

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు స్థిరమైన, నిరంతర ఆదాయం సాధించేందుకు సమీకృత వ్యవసాయ విధానం ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు గ్రామంలో రైతు పడిగా ప్రశాంత్ ఏర్పాటు చేసిన సమీకృత వ్యవసాయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అమలు చేస్తున్న సమీకృత, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆయన పరిశీలించారు.ఈ సమీకృత వ్యవసాయ కేంద్రంలో ఆకుకూరలు, మునగతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలను పూర్తిగా డ్రిప్ ఇరిగేషన్ విధానంలో సాగు చేస్తున్న తీరును కలెక్టర్ ప్రశంసించారు. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నందుకు రైతు పడిగా ప్రశాంత్‌ను అభినందించారు. అలాగే యూనిట్‌లో కొనసాగుతున్న కొర్రమీను చేపల పెంపకం, మేకల పెంపకం, బ్యాక్‌యార్డ్ మదర్ యూనిట్, డక్స్ యూనిట్‌లను కూడా పరిశీలించి, వాటి నిర్వహణపై రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ తరహా సమీకృత వ్యవసాయ యూనిట్లు జిల్లాలోని ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తాయని కలెక్టర్ అన్నారు.అనంతరం మైలవరం గ్రామంలో రైతు మాడె కృష్ణవేణి ఏర్పాటు చేసిన కౌజు పిట్టల యూనిట్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ యూనిట్‌ను కేవలం రూ.25,000/- తక్కువ పెట్టుబడితో షెడ్ నిర్మాణం, ఫెన్సింగ్, కౌజు పిల్లలు, ఫీడ్ మరియు అవసరమైన పరికరాలతో ఏర్పాటు చేసిన విధానాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తక్కువ పెట్టుబడితో గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ యూనిట్లను జిల్లాలో విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని , జిల్లాలో ఈ విధంగా 500 కౌజు పిట్టల యూనిట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అలాగే మైలవరo గ్రామానికి చెందిన యువ రైతు కుంజా సందీప్ అమలు చేస్తున్న ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. అనేక రకాల సమీకృత పంటల సాగుతో పాటు జీవామృతం, పంచగవ్య వంటి సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్లను పరిశీలించి, సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరిగి, సాగు ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు దీర్ఘకాలిక లాభాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా యువ రైతు కుంజా సందీప్‌ను కలెక్టర్ అభినందిస్తూ, సేంద్రియ సాగును మరింత విస్తృతంగా చేపట్టాలని పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ గ్రామంలోని యువ రైతులకు సమీకృత వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు సుజాతనగర్‌లోని రవి హైబ్రిడ్ సీడ్స్ కేంద్రాన్ని సందర్శించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, సమీకృత వ్యవసాయ విధానం రైతులకు స్థిరమైన, నిరంతర ఆదాయాన్ని అందించే ఉత్తమ మార్గమని తెలిపారు. ఒకే వ్యవసాయ క్షేత్రంలో పంటల సాగుతో పాటు పశుపోషణ, పక్షుల పెంపకం, చేపల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను సమన్వయంతో చేపట్టడం వల్ల సాగులోని ప్రమాదాలు తగ్గి లాభాలు పెరుగుతాయని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక సాగునీటి పద్ధతుల వినియోగంతో నీటి వృథా తగ్గి దిగుబడులు మెరుగుపడతాయని అన్నారు. తక్కువ పెట్టుబడితో కౌజు పిట్టల యూనిట్లు, బ్యాక్‌యార్డ్ యూనిట్లు, సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాలు గ్రామీణ యువత, మహిళలకు మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. జిల్లాలో ఈ తరహా మోడల్ యూనిట్లను విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకయ్య,సంబంధిత శాఖల అధికారులు, స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :