తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలం మామిళ్లవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో అతి ముఖ్యమైనవని భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటిస్తూ కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు విద్యార్థులు చదువుతో పాటు మంచి నడవడిక అలవాటు చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు
Admin
తెలుగు వెలుగు టీవీ