Thursday, 17 September 2026 03:55:25 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రోగ్రాం ఆఫీసర్లతో మరియుఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్

Date : 15 June 2026 05:46 PM Views : 123

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కార్యాలయం నందు ప్రోగ్రామ్ ఆఫీసర్లతో పునఃశ్చరణ కార్యక్రమమును నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పల్స్ పోలియో ఈనెల 28న ఉన్నందున దానికి సంబంధించిన సమావేశాలు శిక్షణ కార్యక్రమాలు అదేవిధంగా మొదటి రోజు బూత్ ఆక్టివిటీ రెండవ రోజు మరియు మూడవ రోజుగృహ సందర్శనలు చేయడం గురించి చర్చించడం జరిగినది. ఈ నెల 19న వరల్డ్ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా జిల్లాలో సికిల్ సెల్ ఎనీమియా మరియు తలసీమియా, రక్త కణ లోపాలు ఉన్న వారిని గుర్తించి స్క్రీనింగ్ చేయుట మరియు క్యాంపులు నిర్వహించడం గురించి మాట్లాడడం జరిగినది. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది కొరత ఉన్నందున వాటిని అధిగమించడానికి ఒక పటిష్ట ప్రణాళికను తయారు చేయుట గురించి వివరించడం జరిగినది..డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డా. తుకారాం రాథోడ్ జిల్లా ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిర్వహణ, నిల్వ, పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. గడువు ముగిసిన మందులు (Expired Drugs), వినియోగానికి అనర్హమైన మందుల రికార్డులు, డిస్కార్డ్ చేసిన మందుల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. వ్యాక్సిన్లు మరియు ఫార్మసీ మందుల కోసం ప్రత్యేక స్టాక్ రిజిస్టర్లు నిర్వహించాలని, వేగంగా వినియోగమయ్యే (Fast Moving) మరియు తక్కువగా వినియోగమయ్యే (Slow Moving) మందులపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేపట్టి అవసరమైన మేరకు నిల్వలను నిర్వహించాలని సూచించారు. రోగనిరోధక టీకాల కార్యక్రమంలో ఉపయోగించే వ్యాక్సిన్లను నిర్దేశిత ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడంతో పాటు కోల్డ్ చైన్ నిర్వహణను కచ్చితంగా పాటించాలని తెలిపారు. వ్యాక్సిన్ల నాణ్యతను కాపాడేందుకు కోల్డ్ చైన్ నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. అలాగే మందుల కొనుగోలు, స్వీకరణ, పంపిణీ, నిల్వలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఈ-ఔషధి (e-Aushadhi) పోర్టల్ లో సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య సంస్థల్లో అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ఫార్మసీ అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్వో కొత్తగూడెం డాక్టర్ సాయి కళ్యాణ్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ప్రతాప్ ,డాక్టర్ దినేష్, డాక్టర్ రాకేష్, డాక్టర్ హరీష్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి ,డిపిఎమ్ఓ మోహన్, సిహెచ్ఓ నాగభూషణం, జిల్లా ఫార్మసీ అధికారులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :