Friday, 18 September 2026 02:06:00 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

రైతులకు శాపంగా మారిన భూ భారతి చట్టం.. బిజెపి జిల్లా నాయకులు భూక్య రాజేష్ నాయక్.

Date : 07 March 2026 08:16 PM Views : 605

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు భూక్య రాజేష్ నాయక్ మాట్లాడుతూ భూభారతి చట్టం రైతుల పాలిట శాపంగా మారిందని రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో నీ లోపాల వలన ఇప్పటివరకు మండల వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడాను పట్టా పాస్ బుక్కులు పొందలేకాపోయారు . సాదా బై నామ పేరుతో రైతుల ఉసురు తీస్తున్నారు. ఒకపక్క రైతు బంధు రైతు, భరోసా ఎగుడుతూ మరోపక్క రైతులు వ్యవసాయానికి పనికి వచ్చేటటువంటి యూరియాను పొందలేక వ్యవసాయంలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. పోనీ ఎవరికైనా వారి భూమి అత్యవసరం నిమిత్తం అమ్ముకుందామంటే వారికి పట్టా కూడా లేకుండా పోతున్నాయి. దీనంతటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూ భారతి చట్టం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, కలెక్టర్ స్వయంగా ప్రారంభించి రైతుల దగ్గర నుంచి పట్టాకు సంబంధించిన పాత పహనీలు, జిరాక్స్లు, అన్నియును కూడా తీసుకొని సంవత్సరం నర కాలం గడుస్తున్న ఇంతవరకు ఏ ఒక్కరికి ఒక పట్టా పాస్ బుక్ కూడా మంజూరు చేయలేదు. మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు వారి సొంత భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంటే గతంలో ఉన్నటువంటి ధరణి అయిన కాస్త నయం అనే పరిస్థితికి రైతులు వచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలం పరిస్థితే ఇలా ఉంటే, ఇంకా మిగిలిన మండలాలు వాటి పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ప్రభుత్వం తీరును విమర్శించారు. దీనికి తోడు రైతు భరోసాను అమలు చేయకుండా శాటిలైట్ ద్వారా సర్వే అని చెప్పి, ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ అనీ రైతులకు తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారు. పాస్ బుక్కు లేని రైతులు యూరియాను ఎలా ఆన్లైన్ చేసుకుంటారు అని ఎద్దేవా చేశారు. వ్యవసాయ సీజన్ అంతా అయిపోతున్న కూడా ఇంతవరకు రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేయలేదు. రైతు లేనిదే రాజ్యం లేదు . అలాంటిది రైతులకు దగా చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రులు తక్షణమే ఈ యొక్క భూభారతి లో నమోదైనటువంటి పట్టాలను వెంటనే మంజూరు చేసి, వాటికి రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :