Wednesday, 16 September 2026 04:45:10 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 10 September 2026 06:46 PM Views : 81

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. లక్ష్మీదేవిపల్లిలోని కేంద్రాన్ని చుంచుపల్లికి మార్చే అంశంపై క్షేత్రస్థాయి పరిశీలన.చుంచుపల్లిలో విజయ డెయిరీ కోసం ఇప్పటికే స్థలం కేటాయించినందున, ఆ స్థలంలో విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు లక్ష్మీదేవిపల్లిలోని ప్రస్తుత విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రం ఉన్న స్థలాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నందున, కేంద్రాన్ని చుంచుపల్లికి మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేంద్రాన్ని చుంచుపల్లికి మార్చే అంశంపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కేంద్రంలో ప్రతిరోజూ జరుగుతున్న పాల సేకరణ, శీతలీకరణ ప్రక్రియ, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పరికరాల పనితీరు తదితర వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం పరిధిలో సుమారు 30 గ్రామాలకు చెందిన 400 మంది రైతులు పాల సేకరణకు అనుసంధానమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 500 లీటర్ల వరకు పాలు సేకరిస్తుండగా, పాల ఉత్పత్తి అధికంగా ఉండే సీజన్‌లో రోజువారీ సేకరణ సుమారు 4,000 లీటర్ల వరకు పెరుగుతుందని వివరించారు. ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయాల్లో పాలను సేకరించి ఖమ్మం డెయిరీకి తరలిస్తున్నట్లు తెలిపారు.అనంతరం కలెక్టర్ కేంద్రంలోని కూలింగ్ ట్యాంక్, స్టోరేజ్ వ్యవస్థ, కంప్రెసర్ తదితర పరికరాలను పరిశీలించారు. ప్రస్తుత భవనం, పరికరాల పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అంశంపై అధికారులతో చర్చించారు.చుంచుపల్లిలో విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే స్థలాన్ని గుర్తించి, విజయ డెయిరీ అధికారులకు సూచించినందున, కేంద్రం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. రైతులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పాల సేకరణ మరియు శీతలీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.కేంద్రాన్ని మార్చే సమయంలో పాల సేకరణకు ఎలాంటి అంతరాయం కలగకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. నూతన కేంద్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత రైతులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, అదే సమయంలో విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు కూడా ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు.కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే పనులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.ఈ పరిశీలనలో లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, విజయ డెయిరీ మేనేజర్ సౌజన్య, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :