Thursday, 17 September 2026 06:47:00 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలి : అదనపు కలెక్టర్ వేణుగోపాల్.

Date : 24 August 2026 07:29 PM Views : 121

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలి : అదనపు కలెక్టర్ వేణుగోపాల్. ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి.సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఆర్‌ఓ పద్మావతితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, గృహాలు, ఉపాధి, విద్యుత్, మౌలిక వసతులు తదితర అంశాలపై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావాణి కీలక వేదికగా నిలుస్తోందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.వినతుల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇతర సమస్యలను సంబంధిత శాఖలకు పంపించి వాటి పరిష్కార స్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రజలకు సత్వర సేవలు అందించాలని తెలిపారు.జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ఆధార పత్రాలతో వినతులు సమర్పిస్తే పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని అన్నారు .ప్రజావాణిలో వచ్చిన కొన్ని వినతులు 1. ఇల్లందు మండలానికి చెందిన రచ్చ సుజాత 2008లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి వచ్చి లొంగిపోయినట్లు తెలిపారు. సీపీఐ (ఎంఎల్) పీపీజీ గ్రూప్‌కు చెందిన లింగన్న దళంలో ఆరు సంవత్సరాల పాటు దళ సభ్యురాలిగా పనిచేసిన అనంతరం లొంగిపోయిన సమయంలో ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చినట్లు, ప్రస్తుతం భర్త మృతి చెందడంతో ముగ్గురు పిల్లలతో ఒంటరి మహిళగా జీవిస్తున్నానని, ఇప్పటివరకు భూమి కేటాయించలేదని, తనకు హామీ ఇచ్చిన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఓఎస్-ఈకి ఎండార్స్ చేశారు.అశ్వారావుపేట మండలం దిబ్బగూడెం గ్రామానికి చెందిన తాటి పద్మ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. గతంలో సమర్పించిన దరఖాస్తును పరిశీలించి అర్హత మేరకు ఇల్లు మంజూరు చేయాలని కోరగా పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పీడీ హౌసింగ్‌కు ఎండార్స్ చేశారు.కొత్తగూడెం కార్పొరేషన్ 53వ డివిజన్‌కు చెందిన ముద్దంగుల మహేష్ రహదారి మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఎన్‌పీడీసీఎల్‌కు ఎండార్స్ చేశారు.సుజాతనగర్ మండలం సర్వారం తండాకు చెందిన బాణోత్ హిమబిందు తన కుటుంబం గతంలో అంగన్‌వాడీ పాఠశాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూమి ఇచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, తాను డిప్లొమా, బీటెక్ (EEE) పూర్తి చేసినందున అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం లేదా అంగన్‌వాడీ పోస్టు కల్పించాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు డీడబ్ల్యూఓకు ఎండార్స్ చేశారు.అశ్వారావుపేట మండలం రామన్నగూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరరావు ఎల్-3 జాబితాలో ఉన్న అర్హులైన 71 మంది లబ్ధిదారులను ఎల్-1 జాబితాలోకి మార్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం పీడీ హౌసింగ్‌కు ఎండార్స్ చేశారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :