తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా శనివారం నాడు ఖమ్మం పట్టణం లో " శ్రీ విశ్వావసు ఉగాది కవి సమ్మేళనం" ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవభారత్ స్కూల్ విద్యార్థిని శ్రీ బొమ్మసాని బోధిత సుగంధిని రచించిన " చిన్నారి - చిట్టి కథలు" పుస్తక ఆవిష్కరణ జరిపి చిన్నారి సుగంధిని ని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.ఇంత చిన్న వయసులోనే కథా రచన చేపట్టడం వలన సృజనాత్మకత పెరుగుతుంది, సమాజాన్ని దగ్గరి నుండి చూడడం అలవడుతుంది అని వక్తలు కొనియాడారు. చిన్నారి సుగంధిని మాట్లాడుతూ తన చిన్ననాటి నుండి అమ్మమ్మ కీర్తిశేషులు శ్రీ నంది రాధ గారు చెప్పిన కథలను వింటూ అనేక సందేహాలు నివృత్తి చేసుకుంటూ తిరిగి వాటిని నాకు నచ్చినట్టుగా మార్చి చెప్పేదాన్ని. నా ఆలోచనలు అభిరుచి ని మా అమ్మ నాన్న శ్రీ బొమ్మసాని విజయ ప్రకాష్ జ్యోతిర్మయి గారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహం తో కథా రచన వైపు ఉత్సాహంగా అడుగు ముందుకు వేసాను అని తెలిపారు. ఈ సమ్మేళనం లో చిన్నారి సుగంధిని వినిపించిన శ్రీ శ్రీ గారి రచన 'జగన్నాధ రథచక్రాలు' కవిత సభికులను అలరించింది. ఈ సమ్మేళనం లో సాహితీ వేత్త చేకూరి శ్రీనివాసరావు గారు, ప్రముఖ కవి జీవన్ గారు, తెలంగాణ సాహితీ వేత్త పురిమళ్ళ సునంద గారు సమన్వయ కర్త డా. కటుక్వోజుల రమేష్ గారు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ