Thursday, 14 May 2026 12:57:15 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ఇంటర్, పదోతరగతి ఫెయిల్ విద్యార్థులకు ప్రత్యేక సప్లమెంటరీ క్యాంపులు – 100% ఉత్తీర్ణత లక్ష్యం: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 05 May 2026 07:52 PM Views : 155

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఇంటర్మీడియట్, పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సప్లమెంటరీ క్యాంపులు, పాఠశాలల మౌలిక సదుపాయాలు, అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారీగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను సేకరించి, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. భద్రాచలం, పాల్వంచ, చంద్రుగొండలో నిర్వహిస్తున్న సప్లమెంటరీ క్యాంపుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని సమీక్షించి, ప్రతి విద్యార్థి ఈ క్యాంపులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మే 13 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఈ తరగతుల ద్వారా విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రతి విద్యార్థి హాజరు మరియు అభ్యాస పురోగతిపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.జిల్లా వ్యాప్తంగా పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం కూడా సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని, మండలాలు మరియు పాఠశాలల వారీగా ఫెయిల్ విద్యార్థుల వివరాలతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థుల లోపాలను గుర్తించి, లక్ష్యబద్ధంగా బోధన చేపట్టి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలోని పాఠశాలల్లో వివిధ దశల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన కలెక్టర్, అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుదీకరణ వంటి మౌలిక వసతులు 100 శాతం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 12 నుండి విద్యాశాఖ ద్వారా చేపట్టబడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో అధికారులు తమ మండలాల్లో చేపడుతున్న చర్యలపై వివరాలు తెలియజేయగా, కలెక్టర్ తగిన సూచనలు చేశారు. జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం దిశగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :