తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాలు తరలిరండి డిసెంబర్ 26న 5 లక్షల మందితో నిర్పెక్కబోతున్న ఖమ్మం రామవరం లో ఇంటింటికీ సిపిఐ ఆర్థిక హార్దిక సహకారం అందించండి : సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఫహీమ్ దాదా భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా కార్మిక కర్షక బలహీన వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఫహీమ్ దాదా పిలుపునిచ్చారు ఇందులో భాగంగా రామవరం లో ఇంటింటి సిపిఐ కార్యక్రమం ద్వారా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు, ఈ సందర్భంగా ఫహీమ్ దాదా సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘన చరిత్రను ప్రజలకు తెలిపారు, దేశంలో అధికారం లేకపోయినా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసింది కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనన్నారు. ప్రజల పక్షాన నిలబడుతూ అనేక ఉద్యమాలను నిర్వహించి ప్రజలకు కార్మికులకు హక్కులు సాధించి పెట్టిన ఘన చరిత్ర సిపిఐ సొంతమన్నారు, ఈ క్రమంలో ఎందరో పార్టీ అగ్ర నాయకులు అసువులు భాషరన్నారు 19205 డిసెంబర్ 25న పార్టీ అవిరోహించిన నాటి నుంచి నేటి వరకు అనేక పోరాటాలు చేసిన సిపిఐ పార్టీ వచ్చే డిసెంబర్ 25 శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే సభకు ఆర్థిక సహాయ సహకారం అందించాలని కోరారు, ఖమ్మంలో ఐదు లక్షల మందితో భారీ జనసభ నిర్వహిస్తున్నామని తెలిపారు దీనికి 40 దేశాల నుండి ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారని, కార్మికులు కర్షకులు ఉద్యోగులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపి, మండల రాజు, పార్టీ మోహన్ గుత్తుల శ్రీనివాస్, దాసరి అశోక్, కుమార్, రావుల దాసు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ