తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMSMA) 10వ వార్షికోత్సవం సందర్భంగా గుడిపాడు యూపీహెచ్సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMSMA) కార్యక్రమం 10వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా నేడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్ గుడిపాడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC Gudipadu)ను సందర్శించి గర్భిణీ స్త్రీల ఆరోగ్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా యాంటినేటల్ కేర్ (ANC) క్లినిక్లో గర్భిణీలకు అందిస్తున్న సేవలను పరిశీలించి, గర్భిణీల నమోదు, పరీక్షలు, హైరిస్క్ గర్భిణీల గుర్తింపు, రిఫరల్ సేవలు మరియు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే సంబంధిత రికార్డులను, సిబ్బంది హాజరు వివరాలను తనిఖీ చేసి, సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు అవసరమైన సూచనలు చేశారు.గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ప్రసూతి పూర్వ సేవలు అందించడం ద్వారా మాతా-శిశు మరణాలను తగ్గించడమే PMSMA కార్యక్రమం ప్రధాన లక్ష్యమని డీఎంహెచ్వో తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా శిశు ఆరోగ్య మరియు ఇమ్యునైజేషన్ అధికారి డా. ప్రతాప్ , డిపిఎమ్ఓ మోహన్ మరియు సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ