తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నిన్న (22.04.2025) ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాప్ గా నిలిచిన శ్రీ నలంద జూనియర్ కాలేజి విద్యార్థులు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల చైర్మన్ ఎమ్.వి చౌదరి మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎమ్.పి.సి, బైపిసి, ఎమ్.ఇ.సి మరియు సి.ఇ.సి విభాగాలలో రాష్ట్ర స్థాయి టాప్ మార్కులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. సంవత్సరం మొత్తం కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదివే విద్యార్ధులతో పోటీ పడుతూ జె.ఇ. ఇ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ మరియు ఎమ్సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతూ ఈ స్థాయి మార్కులు సాధించడం శ్రీ నలంద అకడమిక్ ప్రోగ్రామ్స్ విశిష్టతగా పేర్కొన్నారు. జూనియర్ ఎమ్.పి.సి విభాగం నందు టి. ప్రవళిక 467, పి. పవన్ శంకర్ 466 , ఉత్కర్ష్ 466, ఇస్లా వత్ నాగరాజు 466, డి . యశ శ్విని 465,పి . సాయి మధుమిత 465, 460 మార్కులకు పైగా 25 మంది విద్యార్ధులు . జూనియర్ బై.పి.సి విభాగం నందు తన్నీరు మైత్రి 436, బీ . వీనిల 435, వి. చేతన లక్ష్మి 434, ఎమ్ సహస్ర 434, మరియు 425 మార్కుల పైన సాధించిన 9 మంది విద్యార్ధులు. సీనియర్ ఎమ్.పి.సి విభాగం నందు లిక్కి విశ్రుత్ 994 ,గొడుగు . గ్రీష్మ 993 , R. ప్రసన లక్ష్మి 991, భూక్యా స్నేహ 991, షేక్ రుబీనా 990 మార్కుల తో స్టేట్ టాప్ తో పాటు 980 మార్కుల పైన 14 మంది విద్యార్థులు ఘన విజయం సాధించారు. సీనియర్ బై.పి.సి విభాగం నందు టి ఝాన్సీ 993, భావన శ్రీ లక్ష్మి 991,m .శ్రీ వత్సల 991, MD. మహినూర్ 987, B. ఉష శ్రీ 987, M . జోగేన్ధర్ 987, ఎన్ భార్గవి 985 మార్కులతో పాటు 980 మార్కుల పైన 12 మంది విద్యార్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులను మరియు వారి తల్లిదండ్రులను కళాశాల చైర్మన్ ఎమ్. వి చౌదరి మరియు సి.ఇ.ఒ .ఎమ్ చైతన్య కృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఐ.వి మల్లికార్జునరావు , కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ