Sunday, 02 August 2026 04:04:30 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 06 February 2026 06:50 PM Views : 143

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 07, 08 తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు హక్కు వినియోగం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట, ఇల్లందు మరియు కొత్తగూడెం మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల విధుల్లో నియమితులైన అధికారులు, ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది మరియు సహాయక సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండటం వలన పోలింగ్ రోజున తమ స్వంత పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయలేని సిబ్బంది ప్రజాస్వామ్య హక్కును కోల్పోకుండా ఉండేందుకు, Conduct of Elections Rules, 1961 లోని రూల్ 27A, రూల్ 28 మరియు Representation of the People Act, 1951 లోని సెక్షన్ 60 ప్రకారం ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.ఈ మేరకు అశ్వారావుపేట, ఇల్లందు మరియు కొత్తగూడెం మున్సిపాలిటీలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఎన్నికల సిబ్బంది కొత్తగూడెం మరియు పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయాలలో, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు ఇల్లందు మున్సిపాలిటీ కార్యాలయంలో, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు కలిగిన వారు అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ నెల 07 మరియు 08 తేదీల్లో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో నియమితులైన అన్ని శ్రేణుల అధికారులు, ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల నిఘా బృందాలు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది తదితరులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ఎన్నికల విధుల ఉత్తర్వు ప్రతిలిపి, ఉద్యోగ గుర్తింపు కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు (EPIC) మరియు ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.ఫెసిలిటేషన్ సెంటర్లలో అవసరమైన పత్రాల ధృవీకరణ అనంతరం పోస్టల్ బ్యాలెట్ పేపర్ జారీ చేయబడుతుందని, నిర్ణీత విధానంలో గోప్యంగా ఓటు వినియోగించి, సీల్ చేసిన ఎన్వలప్‌ను రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఏర్పాటు చేసిన సీల్ చేయబడిన పోస్టల్ డ్రాప్ బాక్స్‌లో వేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా గోప్యతతో, ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి మరియు సిబ్బంది తమ ప్రజాస్వామ్య హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఇందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినదని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. నిర్ణీత తేదీల్లో అందరూ వ్యక్తిగతంగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :