Wednesday, 16 September 2026 06:53:43 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రవక్త బోధనలు జగతికి మార్గదర్శకాలు.మనుషులంతా ఒక్కటనేది ప్రవక్త సందేశం.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 28 August 2026 06:00 PM Views : 122

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రవక్త బోధనలు జగతికి మార్గదర్శకాలు.సౌభ్రాతృత్వ భావనతోనే శాంతి సౌభాగ్యాలు.మనుషులంతా ఒక్కటనేది ప్రవక్త సందేశం. అసమానతలు వీడి ఐక్యంగా ముందడుగు వేయాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.మహమ్మద్ ప్రవక్త బోధనలు జగతికి మార్గదర్శకాలని, సమసమాజ స్థాపనకు ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం 'మిలాద్ ఉన్ నబీ' పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని మసీద్ కమిటీలు, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో పాతడిపో సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మైనార్టీ సంఘాల రాష్ట్ర నాయకులు నయీమ్ ఖురేషి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కూనంనేని పాల్గొని ప్రసంగించారు. మానవత్వ విలువల పరిరక్షణే పరమ ధర్మమని, సమస్త మానవాళి క్షేమం కోసమే ప్రవక్త జీవన గమనం సాగిందని ఆయన గుర్తుచేశారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను పారద్రోలి పరస్పర విశ్వాసంతో జీవించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, మతసామరస్య పరిపుష్టికి ప్రవక్త సందేశాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరిస్తూ సోదరభావాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ పాల్గొనిమాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏ డబ్ల్యూ ఎస్ అధ్యక్షులు అమీర్ ఖాద్రి, మైనార్టీ నాయకులు షమ్మీద్దీన్, జాఫర్ ఖురేషి, సిరాజ్ భాయ్, హాజీ రంజాన్ ఖాన్, అన్వర్ పాషా, దస్తగిరి టీచర్, ఖాజా బాబా, తాజాద్దీన్, యకూబ్ ఖాద్రి, బాబుజని ఖాన్, అబ్దుల్లా, ఎండీ జమాల్, ఖమర్, జుబేద్ ఆలం, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :