తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 8 తెలుగు వెలుగు) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులను చింతా సౌజన్య, నాయుడు శైలజ లను ఘనంగా సత్కరించిన ఎస్ఐ రవి. ఈ సందర్భంగా ఎస్సై రవి మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళా మణులు సాధించిన విజయాలను గుర్తించి గౌరవించాలన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది ముందడుగు వేసేలా ప్రోత్సహించేందుకు ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దయానంద్, మరియు స్టేషన్ కానిస్టేబుళ్లు పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ