తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు మరియు ఏటీసీ కళాశాలల నిర్మాణానికి సంబంధించి స్థల సమీకరణ, అవసరమైన అనుమతుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులతో ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించిన స్థల సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. విద్యా రంగ అభివృద్ధికి ఈ సంస్థలు ఎంతో కీలకమని అన్నారు . అనుమతుల జారీ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు లేకుండా శాఖల మధ్య సమన్వయం పెంపొందించాలని, ప్రతి దశలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించి పనులను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. సంబంధిత భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా సమగ్ర పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు . ఈ సమావేశంలో ఇల్లందు తాసిల్దార్ రవికుమార్, అశ్వరావుపేట తాసిల్దార్ రామకృష్ణ , ఈ సెక్షన్ సూపర్డెంట్ స్వర్ణలత, రామవరం ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ