Sunday, 02 August 2026 05:00:55 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి : సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్

Date : 31 August 2025 04:59 PM Views : 794

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండపర్తి నరేష్ అన్నారు.కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో మీడియా లెవెన్,న్యాయవాదుల టీమ్ ఐ.ఎల్.పి.ఏ మధ్య జరిగిన ఫ్రెండ్స్ కప్ క్రికెట్ మ్యాచ్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మీడియా లెవెన్ జట్టు గెలుపొందిన న్యాయవాదుల ఐ.ఎల్.పి.ఏ జట్టుకు ట్రోఫీని అందజేశారు.ఈ సంధర్భంగా సిఐ నరేష్ మాట్లాడుతూ ప్రతీ పోటీల్లో గెలుపు ఓటములు సహజమని,సమాజహితం కోసం నిరంతరం పని చేసే న్యాయవాదులు,మీడియా ప్రతినిధులు ప్రొఫెషనల్ క్రీడాకారులుగా ఆడటం హర్షించదగ్గ విషయమన్నారు, ఐ.ఎల్.పి.ఏ.జట్టు క్రీడాకారులు ఓపెనింగ్ బ్యాటింగ్ చేసిన రాధాక్రిష్ణ,చిన్నికృష్ణ 58 పరుగులు జోడించడం కట్టుదిట్టమైన బౌలింగ్,ఫీల్డింగ్ చేయడం అభినందనీయమన్నారు.ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ టీం మరియు మీడియా లెవెన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐ.ఎల్.పి.ఏ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 162 పరుగులు చేయగా 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీడియా లెవెన్ జట్టు 123 పరుగులు మాత్రమే చేయగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(ఐ.ఎల్.పి.ఏ) జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందారు. ఈ కార్యక్రమంలో జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్,న్యాయవాది యెర్రా కామేష్,న్యాయవాదులు జే.గోపికృష్ణ,సాదిక్ పాషా,మారపాక రమేష్,చిన్ని క్రిష్ణ,దారావత్ రాధాకృష్ణ,వడ్లకొండ హరి,సామంత్,కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :