తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు - తీవ్రంగా ఖండిస్తున్నాం.అసెంబ్లీలో టీ-షర్టులు విప్పి బనియన్తో రావడం ఏం రాజకీయ సంస్కారం?టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.TPCC పిలుపు మేరకు ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గం, సుజాతనగర్ సెంటర్ నందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్రా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, అలాంటి గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజకీయ భేదాలు ఉండవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, అయితే వ్యక్తిగత గౌరవాన్ని, స్పీకర్ పదవి ఔన్నత్యాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.మీరు అసెంబ్లీలో టీ-షర్టులు విప్పి, బనియన్తో రావడం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు.ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, జిల్లా జనరల్ సెక్రటరీ పైడా రాజేంద్రప్రసాద్, మాజీ AMC చైర్మన్ రాంబాబు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు కిన్నెర వెంకన్న, సర్పంచ్ లు వజ్జా రామారావు, గుగులోతు జానికిరామ్, శ్రీకాంత్, మాజీ సర్పంచ్ లు భద్రూ నాయక్, రాందాస్ నాయక్, AMC డైరెక్టర్ అమ్రూ నాయక్, కోటేష్ నాయక్, శ్రీనివాస రావు, నరసింహరావు, ఎట్టి భాస్కర్, భుక్య మోహన్, గాజుల సీతారామయ్య, మండే శ్రీను, లింగం లక్ష్మయ్య, చల్లా నాగేశ్వరరావు, ఓర్సు ఉపేందర్, సిద్ధల నరేందర్, నునావత్ సంతోష్, చిట్లూరి సుధీర్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ