Monday, 03 August 2026 03:17:44 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ.

Date : 12 June 2026 06:52 PM Views : 133

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలపై వినియోగదారులు ప్రవక్తగా ఉండాలని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ అన్నారు. పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సైబర్ మోసాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సురక్షితమైన డిజిటల్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎస్బిఐ గత రెండు సంవత్సరాలుగా ఖాతాదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఎస్బిఐ ఆధ్వర్యంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని పేర్కొన్నారు. ఏదైనా సైబర్ మోసం జరిగినట్లయితే మొదటి గంటలోనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా, సైబర్ మోసాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. సైబర్ భద్రతపై సమాచార బ్యానర్లను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు. పాల్గొన్నవారికి వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలు, నివారణ చర్యలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, ఏటీఎం కార్డు వివరాలు, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు సలహా ఇచ్చారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. వినియోగదారులలో సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ అలవాట్లను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఇలాంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తుందని వారు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో కొత్తగూడెం ఐదు బ్రాంచ్ లకు చెందిన బ్రాంచ్ మేనేజర్లు, సారపాక బ్రాంచ్, టౌన్ సారపాక బ్రాంచ్, భద్రాచలం బ్రాంచ్, యూబీ రోడ్ బ్రాంచ్, ఐటీడీఏ పిఓ బ్రాంచ్, పాల్వంచ బ్రాంచ్, కిన్నెరసాని బ్రాంచ్, సిల్ బ్రాంచ్‌, స్థానిక శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :