Saturday, 19 September 2026 08:52:35 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ.

Date : 12 June 2026 06:52 PM Views : 184

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలపై వినియోగదారులు ప్రవక్తగా ఉండాలని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ అన్నారు. పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సైబర్ మోసాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సురక్షితమైన డిజిటల్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎస్బిఐ గత రెండు సంవత్సరాలుగా ఖాతాదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఎస్బిఐ ఆధ్వర్యంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని పేర్కొన్నారు. ఏదైనా సైబర్ మోసం జరిగినట్లయితే మొదటి గంటలోనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా, సైబర్ మోసాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. సైబర్ భద్రతపై సమాచార బ్యానర్లను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు. పాల్గొన్నవారికి వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలు, నివారణ చర్యలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, ఏటీఎం కార్డు వివరాలు, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు సలహా ఇచ్చారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. వినియోగదారులలో సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ అలవాట్లను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఇలాంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తుందని వారు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో కొత్తగూడెం ఐదు బ్రాంచ్ లకు చెందిన బ్రాంచ్ మేనేజర్లు, సారపాక బ్రాంచ్, టౌన్ సారపాక బ్రాంచ్, భద్రాచలం బ్రాంచ్, యూబీ రోడ్ బ్రాంచ్, ఐటీడీఏ పిఓ బ్రాంచ్, పాల్వంచ బ్రాంచ్, కిన్నెరసాని బ్రాంచ్, సిల్ బ్రాంచ్‌, స్థానిక శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :