Monday, 03 August 2026 09:38:38 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు.... జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 09 February 2026 09:45 PM Views : 161

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మునిసిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్.మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మునిసిపల్ ఎన్నికలపై సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఐ డి ఓ సి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన , సాధారణ ఎన్నికల పరిశీలకులు అమోయ్ కుమార్, జడ్పీ సీఈవో నాగలక్ష్మి లతో కలిసి పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఇల్లందు మున్సిపాలిటీ అశ్వరావుపేట మున్సిపాలిటీలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో మూడవ ర్యాండమైజేషన్ పూర్తిచేసి పోలింగ్ బృందాలను ఫైనల్ చేసామని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని అన్నారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేశామని, అక్కడ పోలింగ్ సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ అందించామని, కౌంటింగ్ హాల్స్ నందు అవసరమైన ఏర్పాట్లు కల్పించామని కలెక్టర్ తెలిపారు.100 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విజయవంతంగా పూర్తి చేసామని, పోలింగ్ ముగిసిన వెంటనే సిబ్బందికి అవసరమైన టిఏ, డిఏ ల చెల్లింపులు జరిపేలా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇంచార్జి అధికారి ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించా మన్నారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పటిష్టంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :