Sunday, 02 August 2026 02:55:54 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 05 June 2026 08:37 PM Views : 90

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల అమలు, ఉపాధి కల్పన కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని సూచించారు. యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన సలహాలు, సహాయ సహకారాలు అందించి కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పించాలని అన్నారు. పరిశ్రమల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి కోసం వైటీసీ, పాలిటెక్నిక్ మరియు ఇతర సాంకేతిక విద్యా కోర్సులపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నూతన కోర్సుల వివరాలతో కూడిన కరపత్రాలను అందుబాటులో ఉంచి విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. సమావేశంలో భాగంగా టీజీఐపాస్ (TG-iPASS) ద్వారా పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. మొత్తం 50 దరఖాస్తులు అందగా, వాటిలో 39 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఒక దరఖాస్తు తిరస్కరించగా, మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సేవా రంగ సంస్థలకు పెట్టుబడి రాయితీ పథకం అమలు, దరఖాస్తుల స్థితిగతులపై కూడా చర్చించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) స్థాపనకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. క్లస్టర్ అభివృద్ధి, స్థానిక వనరుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించారు. యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉద్యోగ మేళాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు.పరిశ్రమల సంఖ్యను పెంచి జిల్లాను పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు.సమావేశంలో డేవిడ్ రాజు ఏపీఓ జనరల్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఎల్ డి ఎం రామిరెడ్డి, మెప్మా పీడీ రాజేష్, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంగామ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :