తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం, డిసెంబర్ 20 {తెలుగు వెలుగు} లీగల్:: 15 మందికి జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా... 2014 సెప్టెంబర్ 8 న గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇల్లందు 24 ఏరియాకి చెందిన పులిపాటి లోకేష్ @సాయికుమార్, తన వరుస కు చెల్లెను అవినాష్ ప్రేమిస్తున్నాడని అతనికి వార్నింగ్ ఇవ్వడానికి ఇల్లందు వివిధ ఏరియాలకు చెందిన షేక్ అరీఫ్,నీలిమరి నాగరాజు, దేవరపల్లి జితేందర్ రెడ్డి, ఏలుగు సమంత్,తాళ్లపల్లి వంశీ,బండి శ్రీకాంత్,కరకుపల్లి ప్రేమ్ కుమార్, ఎట్టి వెంకటేశ్వర్లు, దడిగల నరేష్, ఎడారి సంపత్, చింతలచెరువు రఘు, కుండోజు రాజు, బోశాల ఉదయ్ కుమార్, సూరపాక గౌతమ్ లను పిలిపించి అవినాష్ పై ద్వేషం పెంచుకొని వార్నింగ్ ఇవ్వమని తన వర్ష కు చెల్లెలిని ప్రేమిస్తున్నాడని చెప్పేసి వార్నింగ్ అని చెప్పి వారిని ఉసిగొలిపినాడు. వారు అవినాష్ తో ప్రమాణం చేయించారు. అదే టైంలో నరేష్ తమ్ముడు శ్రవణ్ కలుగజేసుకొని నీలమర్రి నాగరాజును చెంప మీద కొట్టగా నరేష్ శ్రవణులు దాదాగిరీ చేస్తున్నారని, షేక్ హరీష్ ను నెట్టేశారు. దండు శ్రీను పెద్దమనిషిగా, సతీష్, రమేష్, కృష్ణ, సంతోష్ లు అందరూ వచ్చి వారి గుంపును చెరువు కట్ట వరకు తరిమారు. నీలమర్రి నాగరాజు ఏలుగు సమంత్ అందరికీ ఫోన్ చేసి కరలు పట్టుకొని పదినిమిషాల్లో రమనగా ఆటోలలో అందరూ ఆయుధములతో దిగారు. ఐదుగురు మీద దాడి చేశారు దండు శ్రీను కదలకుండా సతీష్,రమేష్,కృష్ణ,సంతోష్ లకు కూడా రక్త గాయాలు కాగా ఇల్లెందుకు చెందిన మహమ్మద్ ముగ్ధం అలీ @ రషీద్ ఇల్లందు పోలీసు వారికి ఫిర్యాదు చేయగా అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ బి. అశోక్ కేసు నమోదు చేసుకున్నారు. 2017 జూన్ 13 న హాస్పిటల్ లో దండు శ్రీను చనిపోయాడు. అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఎన్.రమేష్, ఏ నరేందర్ లు దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో 23 మంది సాక్షుల విచారణ అనంతరం, 15 మంది పై నేరం జరువైనది. ఇల్లెందుకు చెందిన షేక్ అరీఫ్, నేలమర్రి నాగరాజు,, దేవరపల్లి జితేందర్ రెడ్డి, ఎలుగు సమంత్,పులిపాటి లోకేష్, తాళ్లపల్లి వంశీ, బండి శ్రీకాంత్, కాకరపల్లి ప్రేమ్ కుమార్, ఎట్టి వెంకటేశ్వర్లు, దడిగల నరేష్, ఎడారి సంపత్, చింతలచెరువు రఘు, కుండోజు రాజు, బోశాల ఉదయ్ కుమార్, సూరపాక గౌతమ్ లకు మూడు సంవత్సరంల జైలు శిక్ష ఒక్కొక్క మనిషి ఒక్కొక్కంటికి 2000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాస్క్యూషన్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి.లక్ష్మి నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్,లైజాన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు (కోర్టు డ్యూటీ ఆఫీసర్) ఇల్లందు పిఎస్ పిసి శ్రీనివాస్ లు సహకరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ