తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 15 (తెలుగు వెలుగు ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరం పట్టణ అంబేద్కర్ భవన్ నందు మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 78 వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగల భూపేష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశానికి 1947, ఆగస్టు 15న అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ కి రాజ దండనం అందజేశారని , ఆ తర్వాత బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నియమించగా అయినా ప్రపంచంలోనే అతిపెద్ద లికిత పూర్వక భారత రాజ్యాంగ పుస్తకాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందీ. ఆ రాజ్యాంగ పుస్తకాన్ని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ కి 1949, నవంబర్ 26న ఇవ్వడం జరిగింది ఆ తర్వాత భారత ప్రభుత్వం జనవరి 26, 1950 నుండి భారత గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న అధ్యక్షత వహించగా తొలుత సంగం సీనియర్ నాయకులు జంగం కృష్ణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం రిటైర్డ్ ప్రభుత్వ ప్రిన్సిపాల్ తిప్పారపు రాయలింగు జెండాను ఆవిష్కరించారు. మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బరిగెల భూపేష్ , జిల్లా నాయకులు సావటి స్వామి, బొంకూరి పోశం, కొత్తూరు మదనయ్య, మాటేటి గోపాల్, గంటాడి కోటేశ్వరరావు, కాంపెల్లి దుర్గయ్య, ఇండిగపెళ్లి శంకర్, తిప్పారపు ఎల్లయ్య, ఓడ్డూరి హరిబాబు, బరిగెల స్వామి,మాటేటి అంజయ్య, సూదనాల రమేష్, మన్నెంపెళ్లి మోహన్,చెరుపల్లి కోటేశ్వరరావు, మల్లారపు కొమరయ్య, సామర్ల సారయ్య,ఇల్లందుల పోచయ్య, టంగుటూరి భీమయ్య, కె. నర్సయ్య, నమిళ్ళ శేఖర్ , కృష్ణ, టి. యశ్వంత్, టి. జస్వంత్, పెయ్యల రంగారావు,పాటి మోహన్,షేక్ నాగుల్ మీరా, గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ