Monday, 03 August 2026 12:50:09 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 16 March 2026 04:40 PM Views : 188

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, గృహ నిర్మాణ శాఖాధికారి రవీంద్రనాథ్ లతో కలిసి కలెక్టర్ ప్రజల వినతిపత్రాలను స్వయంగా స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు.

ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సాంబ పూర్ణచంద్రరావు (తండ్రి: వెంకటేశ్వర్లు) తమకు కొత్తగూడెం పట్టణ పరిధిలోని గాజులరాజా బస్తీ, విశ్వనాథ కాలనీ, హౌస్ నం.169/A వద్ద 0.22 కుంటల పట్టా భూమి ఉందని తెలిపారు. ఆ భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి గృహ నిర్మాణం చేపడుతున్నారని, కావున తగిన చర్యలు తీసుకొని తమ భూమిని తిరిగి తమకు అప్పగించాలంటూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఎండార్స్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సాయినగర్ కాలనీకి చెందిన ప్రజలు తమ కాలనీ సుమారు 35 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పటి నుండి సీసీ రోడ్డు నిర్మాణం కోసం అనేకసార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు రోడ్డు నిర్మాణం జరగలేదని తెలిపారు. 2019లో రూ.20 లక్షలు మంజూరైనట్లు చెప్పినప్పటికీ డ్రైనేజీ మరియు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని పేర్కొంటూ వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం లక్ష్మీదేవిపల్లి ఎంపీడీవోకు ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన అశోక్ తమ గ్రామంలో సుమారు 10 సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ ట్యాంక్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు సక్రమంగా నీటి సరఫరా జరగలేదని తెలిపారు. గ్రామంలో ఉన్న రెండు బోర్లు కూడా ప్రస్తుతం పనిచేయడం లేదని పేర్కొంటూ వేసవి కాలంలో త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు మిషన్ భగీరథ నీటి సరఫరా పునరుద్ధరించడంతో పాటు బోర్లను మరమ్మతు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం మిషన్ భగీరథ అధికారులకు ఎండార్స్ చేశారు. మణుగూరు మండలం విట్టల్‌రావు నగర్‌కు చెందిన రావుల రాములు (తండ్రి: లేటు నారాయణ) తమకు తిర్లాపురం గ్రామం సర్వే నం.16/23/Aలో ఐదు ఎకరాల భూమి ఉందని తెలిపారు. తమ తండ్రి మరణానంతరం కుటుంబ సభ్యులు ఆ భూమిని తమ పేర్లతో సర్వే చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ వివాదంలో ఉన్న భూమిపై సర్వే ప్రక్రియతో పాటు భూమి పరిహారం చెల్లింపులు తాత్కాలికంగా నిలిపివేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం భూసేకరణ అధికారులకు ఎండార్స్ చేశారు. ములకలపల్లి మండలం మాదారం గ్రామపంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న ఉకంటి రవికుమార్ (తండ్రి: వెంకట్రావు) గత రెండు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలో పాలకవర్గాలు లేని సమయంలో నిర్వహించిన ఖర్చులు మరియు అప్పుల వివరాలను గ్రామపంచాయతీ నోటీస్ బోర్డులో ప్రజలకు తెలియజేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా పంచాయతీ అధికారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :