Sunday, 02 August 2026 07:45:55 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మీసేవ సేవల ధృవీకరణకు భౌతిక పత్రాలు అవసరం లేదు- ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన పత్రాలనే పరిశీలించాలి- జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్

Date : 25 May 2026 05:57 PM Views : 84

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీసేవ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు సులభతరంగా అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదాయ, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, ఇబీసీ , ఓబీసీ తదితర సేవల ధృవీకరణ కోసం ఈ ఎస్ డి అభివృద్ధి చేసిన GPOs & MRIs Verification Mobile Application అమలులో ఉన్నదని తెలిపారు. ఈ యాప్ ద్వారా సంబంధిత అధికారులు మీసేవ దరఖాస్తు వివరాలు, అప్లోడ్ చేసిన పత్రాలను ఆన్‌లైన్‌లో పరిశీలించి, అర్హత ఆధారంగా ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయాలు తీసుకునే విధానం అమల్లో ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో మీసేవ దరఖాస్తుల పరిశీలన కోసం ప్రజల నుండి ఎలాంటి భౌతిక పత్రాలను స్వీకరించరాదని స్పష్టం చేశారు. మండల, గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు కూడా భౌతిక పత్రాలను కోరరాదని సి సి ఎల్ ఏ కార్యాలయం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు మీసేవ దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన అనంతరం ఎలాంటి భౌతిక పత్రాలను అధికారులకు లేదా సిబ్బందికి అందజేయవద్దని సూచించారు. జిల్లా పరిపాలన ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, ఇబ్బందుల్లేని సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మీసేవ సేవలకు సంబంధించిన సమస్యలు ఎదురైనట్లయితే సంబంధిత మండల అధికారులను లేదా జిల్లా మీసేవ మేనేజర్లను సంప్రదించాలని సూచించారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : కృష్ణమూర్తి – 9133122022 రాకేష్ – 9000420792 ఈ -డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వర రావు – 7337340825 ను కూడా సంప్రదించవచ్చని తెలిపారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :