తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో టీజీ టెట్ జూన్-2026 పరీక్షల రెండవ రోజు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. పాల్వంచ లోని అనూబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉదయం సెషన్లో 67 మందికి గాను 45 మంది, మధ్యాహ్నం సెషన్లో 145 మందికి గాను 134 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ పరీక్షల ప్రశాంత నిర్వహణకు చర్యలు చేపట్టారని ఒక ప్రకటన లో తెలిపారు .
Admin
తెలుగు వెలుగు టీవీ