Thursday, 14 May 2026 12:57:19 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ఎర్రగుంట వద్ద రైతుల ధర్నా ఘటనపై స్పందించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్.

Date : 24 April 2026 08:24 PM Views : 84

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ధాన్యం శుభ్రపరిచి తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి.జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనదని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సుమారు 15 లారీల ధాన్యం రావడం జరిగిందన్నారు.ఈ క్రమంలో ఈ రోజు ఎర్రగుంట వద్ద జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించిన ఘటనపై ఆయన స్పందించారు. పౌరసరఫరాల శాఖ అధికారుల పరిశీలనలో ధాన్యంలో తేమ శాతం (మాయిశ్చర్) అనుకూలంగా ఉన్నప్పటికీ, ధాన్యం పరిశుభ్రత లోపించడం గమనించినట్లు తెలిపారు. గుంపెనలు మరియు మలినాలు కలిసివుండటం వల్ల నాణ్యత ప్రమాణాలకు సరిపోకపోవడంతో కొనుగోలులో ఇబ్బందులు తలెత్తినట్లు వివరించారు.వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించగా కూడా ధాన్యం శుభ్రపరిచే ప్రక్రియ సరిగా జరగలేదని వెల్లడించినట్లు చెప్పారు. వెంటనే ప్యాడీ క్లీనర్లను వినియోగించి ధాన్యాన్ని శుభ్రపరిచిన తరువాత కొంతవరకు మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, కొంతమంది రైతులు శుభ్రపరచకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ధర్నాకు దారితీసిందన్నారు.ఈ విషయంపై తక్షణమే పౌరసరఫరాల శాఖ అధికారులు, సంబంధిత మేనేజర్లు రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని పరిశుభ్రపరిచి మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు ఇప్పటికే మార్గదర్శకాలు అందించినట్లు వెల్లడించారు.రైతులు ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ తమ ధాన్యాన్ని పూర్తిగా శుభ్రపరిచి తీసుకురావాలని, కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :