Wednesday, 16 September 2026 02:43:18 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి : సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి

Date : 01 December 2025 06:19 PM Views : 253

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామ పంచాయతీ ఎన్నికలు పక్కడిబందిగా నిర్వహించాలి అని సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 సందర్భంలో, జిల్లా ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్, గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, ఎలక్షన్ ఎక్సపెన్దిచర్ పరిశీలకురాలు లావణ్యతో కలిసి, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, ఏ ఓ లు, ఏ ఈ ఓ లతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతా చర్యలు, పోలింగ్‌కు సంబంధించిన అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, నోడల్ అధికారులు, పోలీస్ సిబ్బంది మరియు అన్ని సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి, ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలి అని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల భద్రతా ఏర్పాట్లను క్రమానుగుణంగా పరిశీలించాలని, అన్ని శాఖలు సమన్వయం గా పనిచేయాలని ఆయన స్పష్టంగా ఆదేశించారు. మొదటి దశ నామినేషన్ల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుని, రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పోలింగ్ రోజు, ముందురోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పటిష్ట భద్రత, మద్యం నియంత్రణ, పోలింగ్ నిర్వహణలో తగిన సమగ్రత కోసం వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై కూడా సవివరమైన సూచనలు అందించారు. అన్ని కార్యకలాపాలు తగిన విధంగా కొనసాగుతున్నాయా అని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తక్షణమే పరిష్కరించబడేలా అధికారులకు ఆదేశించారు.రోజు వారి నివేదికలు క్రమం తప్పకుండ సమయానసారం అందించాలని అన్నారు. ఎలక్షన్ వ్యయ పరిశీలకురాలు లావణ్య మాట్లాడుతూ, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు అమలు చేయాలని, ఎఫ్ఎస్ఈ (ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్) మరియు ఎస్ఎస్ఈ (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్) బృందాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ నిర్వహించమని సూచించారు. అభ్యర్థుల ఖర్చులు, పత్రికా ప్రచారం, సోషల్ మీడియా వ్యూహాలు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశం లో సిపిఓ సంజీవరావు, ఇన్చార్జి డిపిఓ సుధీర్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, అడిషనల్ డి ఆర్ డి ఓ రవి, ఏవోలు ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :