Wednesday, 16 September 2026 03:32:47 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 22 July 2025 06:07 PM Views : 626

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్ నందు ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుకు మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ద్వారా ఏర్పాటుచేసిన వివిధ స్టాల్సును వారు తయారు చేసిన ఆహార పదార్థాలను ఆయన పరిశీలించి మహిళలను అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహకాల గురించిన ప్రగతి నివేదికలను సభకు వివరించారు. అనంతరం కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. దీనిలో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళల సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి పలు మహిళా అభ్యున్నతి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని, ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డుల సవరణలు మరియు చేరికలు కూడా చేపట్టారన్నారు. ఈనెల 25 నుంచి 10 వ తారీకు వరకు ప్రతి మండల కేంద్రంలో రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తుగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగపరచుకోవాలని, తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంతో పాటు కుటుంబాలు అభివృద్ధి, సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. మహిళల శక్తిని గుర్తించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, సుజాతనగర్ మరియు పాల్వంచ మండలాల్లో మొత్తం 2984 మహిళా సంఘాల లో 29,801 సంఘ సభ్యులు ఉండగా, బ్యాంకు లింకేజ్: ద్వారా 157 స్వయం సహాయక సంఘాలకు 18 కోట్ల 27 లక్షలు. వడ్డీ లేని రుణాలు :2100 స్వయం సహాయ సంఘాలకు రెండు కోట్ల 36 లక్షలు. లోన్ బీమా: ఈ పథకం ద్వారా 7 కి 5,90, 448 రూపాయలు. ప్రమాద భీమ: ఈ పథకం క్రింద -01 కి 10,00,000 రూపాయలు. మహాలక్ష్మి పథకం: ద్వారా పాల్వంచ మండలంలో ఒక బస్సుకు 69,468.00 రూపాయల చెక్కులను శాసనసభ్యుని చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్ డి ఓ మధు, డీఎస్ఓ రుక్మిణి, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, తాసిల్దార్ లు కొత్తగూడెం పాల్వంచ సుజాతనగర్ చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి, మహిళా సంఘాలు సభ్యులు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :