Wednesday, 16 September 2026 04:09:09 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

విపత్తుల వేళ తక్షణ స్పందనకు యువ ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ అంకిత్

Date : 16 September 2026 03:11 PM Views : 33

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో ఆపదమిత్రల పాత్ర కీలకం యువ ఆపదమిత్రల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్ సమయస్ఫూర్తి, మానసిక అప్రమత్తతతో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి విపత్తులు సంభవించిన సమయంలో తక్షణమే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో ఆపదమిత్రలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండ ఆరవ బెటాలియన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో యువ ఆపదమిత్రల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా 6వ బెటాలియన్‌కు చేరుకున్న కలెక్టర్‌కు బెటాలియన్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ భౌగోళిక, వాతావరణ పరిస్థితుల వైవిధ్యం కారణంగా దేశంలో వివిధ రకాల విపత్తులు సంభవించే అవకాశం ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరదలు, ఆకస్మిక వరదలు, పట్టణ ప్రాంతాల్లో నీటి ముంపు, అటవీ అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు తదితర విపత్తులు సంభవించే అవకాశం ఉన్నందున స్థానికంగా శిక్షణ పొందిన యువత అందుబాటులో ఉండటం ఎంతో అవసరమన్నారు. అధికారిక సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు స్థానికంగా శిక్షణ పొందిన ఆపదమిత్రలు తక్షణ సహాయక చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చన్నారు. 6వ బెటాలియన్ కమాండెంట్ పి.సి.వి. రమణ మాట్లాడుతూ విపత్తులు సంభవించిన తొలి కొన్ని నిమిషాలు అత్యంత కీలకమన్నారు. అధికారిక సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు స్థానికంగా శిక్షణ పొందిన ఆపదమిత్రలు వేగంగా స్పందించి ప్రాథమిక సహాయక చర్యలు చేపట్టగలరన్నారు. శిక్షణలో బోట్ నిర్వహణ, తాళ్ల సహాయంతో రక్షణ చర్యలు, పైకి ఎక్కడం, కిందికి దిగడం, రాక్ క్లైంబింగ్, వివిధ రకాల ముడుల వినియోగం వంటి ప్రాక్టికల్ అంశాలను పూర్తిగా నేర్చుకోవాలని సూచించారు. శిక్షణలో ఏదైనా అంశం స్పష్టంగా అర్థం కాకపోతే శిక్షకులను అడిగి తెలుసుకుని, పదేపదే సాధన చేయడం ద్వారా పూర్తి నైపుణ్యం, ఆత్మవిశ్వాసం సాధించాలని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా ఆపదమిత్రలకు జిల్లా కలెక్టర్ అంకిత్ చేతుల మీదుగా శిక్షణ కిట్లను అందజేశారు. విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వచ్చిన ఆపదమిత్రలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణ పొందుతున్న ప్రతి ఆపదమిత్రకు మూడు సంవత్సరాల కాలానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 416 మంది ఆపదమిత్రులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా తొలి విడతగా 120 మందికి శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ శ్రీధర్ రాజా, అసిస్టెంట్ కమాండెంట్ మరియా దాస్, లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, ఎంపీడీవో సుచిత్ర, పోలీసు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు, శిక్షకులు, ఆపదమిత్రలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :