Friday, 18 September 2026 04:49:11 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కోసం తొలి ఉద్యమం ఎఐటియుసిదే – మిర్యాల రంగయ్య.

Date : 09 July 2026 06:25 PM Views : 421

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని 2013లోనే ఎఐటియుసి ఉద్యమాన్ని ప్రారంభించిందని, అనంతరం 2017 మే 12 నుంచి 18 వరకు "సింగరేణి జాతా" పేరుతో తాడిచర్ల–2 ప్రాజెక్టును సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర నిర్వహించిన ఏకైక కార్మిక సంఘం ఎఐటియుసి మాత్రమేనని అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య తెలిపారు.కార్పొరేట్ ఏరియా మెయిన్ వర్క్‌షాప్‌లో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, కార్మికుల పట్ల యాజమాన్యం అవలంబిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా, పెర్క్స్‌పై విధిస్తున్న ఆదాయ పన్నును రద్దు చేయాలని, సింగరేణి వ్యాప్తంగా గనులు, వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలని కోరారు.రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ, లిక్కర్ స్కామ్‌లో బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం "బయ బాట" పేరుతో కార్మికుల ముందుకు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో కార్మికుల సంక్షేమం కోసం చెప్పుకోదగ్గ చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు సానుభూతి కోసం మాట్లాడడం సమంజసం కాదన్నారు. కార్మికులు అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, ఉపాధ్యక్షుడు క్రిస్టోఫర్, పిట్ కార్యదర్శి సుధీర్, నాయకులు వేమన చారి, దినేష్, సత్యనారాయణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :