Monday, 03 August 2026 03:33:12 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కోసం తొలి ఉద్యమం ఎఐటియుసిదే – మిర్యాల రంగయ్య.

Date : 09 July 2026 06:25 PM Views : 362

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని 2013లోనే ఎఐటియుసి ఉద్యమాన్ని ప్రారంభించిందని, అనంతరం 2017 మే 12 నుంచి 18 వరకు "సింగరేణి జాతా" పేరుతో తాడిచర్ల–2 ప్రాజెక్టును సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర నిర్వహించిన ఏకైక కార్మిక సంఘం ఎఐటియుసి మాత్రమేనని అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య తెలిపారు.కార్పొరేట్ ఏరియా మెయిన్ వర్క్‌షాప్‌లో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, కార్మికుల పట్ల యాజమాన్యం అవలంబిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా, పెర్క్స్‌పై విధిస్తున్న ఆదాయ పన్నును రద్దు చేయాలని, సింగరేణి వ్యాప్తంగా గనులు, వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలని కోరారు.రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ, లిక్కర్ స్కామ్‌లో బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం "బయ బాట" పేరుతో కార్మికుల ముందుకు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో కార్మికుల సంక్షేమం కోసం చెప్పుకోదగ్గ చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు సానుభూతి కోసం మాట్లాడడం సమంజసం కాదన్నారు. కార్మికులు అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, ఉపాధ్యక్షుడు క్రిస్టోఫర్, పిట్ కార్యదర్శి సుధీర్, నాయకులు వేమన చారి, దినేష్, సత్యనారాయణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :