తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిట్టి రామవరం తండాకు చెందిన అర్హులైన నిరుపేద కుటుంబాలకు తక్షణమే పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని 19వ డివిజన్ సిపిఐ నాయకులు బానోతు శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. గత తెలంగాణ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆనాడు ఆగిపోయిన పోడు పట్టాలను చిట్టి రామవరం ప్రాంత గిరిజన లంబాడి దారులకు పోడు పట్టాలు ఇచ్చి గిరిజన రైతులను ఆదుకోవాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు.గరిపేట గ్రామపంచాయతీ గ్రామ పరిధిలోని అంబేద్కర్ నగర్ బీట్ లోని ఫారెస్ట్ భూమి కంపార్ట్మెంట్ నెం. 1 సర్వే నంబర్ 20 లో గల ROFR ఫారెస్ట్ పోడు భూములను గత 1980 నుండి 45 సంవత్సరాలుగా మా పూర్వీకుల కాలం నుండే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండగా గత ప్రభుత్వం పోడు రైతులందరికి పోడు పట్టా ఇస్తానని వందలో 50% కూడా పోడు పట్టాలు ఇవ్వకుండా కొంతమందికే పట్టాలు ఇచ్చింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం పోడు పట్టాల ఊసే తీయడం లేదు సిపిఐ పార్టీ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో పోడు సాగులో గిరిజన ఆరాధ్య అమ్మవార్లను మా కుల దేవతలు శీతల భవాని ని పూజించడం జరిగింది పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా 54 ఎకరాలలో కేవలం 18 ఎకరాలు మాత్రమే ఇచ్చి మా తాత ముత్తాతల నుంచి వచ్చిన మా భూముల నుండి మమ్మల్ని దూరం చేస్తున్నారని చిట్టి రామవరం రైతులు బాధపడుతున్నారు ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు తెలంగాణ ప్రభుత్వం *షెడ్యూల్ తెగలు ఇతర పరంపరాగాత అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 మరియు నిబంధనలు 2012 అటవీ మా భూమి మొత్తం 54 ఎకరాలు ఉండగా అందులో నుంచి 18 ఎకరాలు మాత్రమే పట్టాలు ఇచ్చారు మిగిలిన భూమినీ గిరిజన రైతులకు ఇవ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారని పోడు రైతులను మాయ మాటలు చెప్పి కొత్త మంది కే పట్టాలు ఇచ్చినారు. మిగతా పోడు రైతులకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అన్యాయమైన పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టి రామవరం తండా పోడు రైతులు ప్రజలు, నాయకులు మూడు రమేష్ నాయక్, గూగులోత్ బుజ్జి, భానోత్ కిషన్, బానోత్ రాము తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ